ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ ఆస్తులను రక్షించుకోవడానికి సురక్షితమైన మార్గాలను వెతుకుతున్నారు. సాధారణంగా ఆపద కాలంలో బంగారం(Gold), వెండి (Silver) రెండింటినీ సురక్షితమైన పెట్టుబడులుగా భావిస్తారు. అయితే DBS బ్యాంక్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ హౌ వే ఫూక్ తన తాజా నోట్లో ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. పోర్ట్ఫోలియో రిస్క్ను తగ్గించడంలో బంగారం ఇచ్చే రక్షణను వెండి ఇవ్వలేదని ఆయన అన్నారు. దానికి ఆయన మూడు ప్రధాన కారణాలను వివరించారు.

1. పారిశ్రామిక డిమాండ్ పై ఆధారపడటం
వెండికి ఉన్న అతిపెద్ద బలహీనత దాని పారిశ్రామిక వినియోగం. వెండి (Silver) మొత్తం డిమాండ్లో దాదాపు 60 శాతం పారిశ్రామిక అవసరాల నుంచే వస్తుంది. ఆర్థిక వ్యవస్థ బలహీనపడినప్పుడు లేదా యుద్ధం వంటి కారణాల వల్ల పరిశ్రమలు మందగించినప్పుడు.. వెండి ధరలు భారీగా పడిపోయే అవకాశం ఉంది. దీనికి విరుద్ధంగా బంగారానికి పారిశ్రామిక డిమాండ్ కేవలం 10 శాతం మాత్రమే ఉంటుంది. అందుకే ఆర్థిక మాంద్యం సమయంలో కూడా బంగారం నిలకడగా ఉంటుంది. కానీ, వెండి ధరలు ఒడిదుడుకులకు లోనవుతాయి.
2. మార్కెట్ పరిమాణం, అస్థిరత
బంగారంతో పోలిస్తే వెండి మార్కెట్ చాలా చిన్నది. ప్రపంచ గోల్డ్ మార్కెట్ విలువ 36 ట్రిలియన్ డాలర్లు ఉంటే.. వెండి మార్కెట్ కేవలం 5 ట్రిలియన్ డాలర్లు మాత్రమే. మార్కెట్ చిన్నదిగా ఉండటం వల్ల స్పెక్యులేటర్లు, రిటైల్ ఇన్వెస్టర్ల చిన్న చిన్న కదలికలు కూడా వెండి ధరలను భారీగా ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు ఈ ఏడాది ప్రారంభంలో మార్కెట్ పతనమైనప్పుడు, బంగారం ధర 9 శాతం మాత్రమే తగ్గగా వెండి ఏకంగా ఒకే రోజులో 30 శాతం పైగా పడిపోయింది. ఇంతటి అస్థిరత ఉన్నప్పుడు రిస్క్ తగ్గించుకోవడానికి వెండిని నమ్మడం కష్టమని ఫూక్ పేర్కొన్నారు.
3. 'సేఫ్ హెవెన్' హోదా లేకపోవడం
చరిత్రను గమనిస్తే.. అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థకు బంగారమే పునాదిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు దశాబ్దాలుగా తమ నిల్వలలో (Reserves) బంగారాన్ని భాగంగా చేసుకుంటున్నాయి. కానీ, వెండికి అటువంటి గుర్తింపు లేదు. యుద్ధం వంటి అత్యవసర పరిస్థితుల్లో పెట్టుబడిదారులు డాలర్ కంటే బంగారం వైపే మొగ్గు చూపుతారు. ఇరాన్ యుద్ధం , అమెరికాలో ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న సైనిక చర్యల వల్ల భౌగోళిక రాజకీయ రిస్క్ పెరిగింది. ఇది బంగారానికి లాభిస్తుంది తప్ప, వెండికి కాదు.
ప్రస్తుత ధరల పరిస్థితి
ప్రస్తుతం మార్కెట్లో మే 5 డెలివరీకి సంబంధించి వెండి (Silver) ఫ్యూచర్స్ కేజీకి రూ. 2,71,200 వద్ద 2.2 శాతం పెరిగి ట్రేడ్ అవుతోంది. మరోవైపు బంగారం 10 గ్రాములు రూ. 1,62,931 వద్ద 1.13 శాతం లాభంతో ఉంది. యుద్ధం వల్ల డాలర్ విలువ పడిపోవడం (De-dollarization) వంటి అంశాలు ఇన్వెస్టర్లను బంగారం వైపు మళ్లిస్తున్నాయి. అధిక నెట్ వర్త్ ఉన్న వ్యక్తులు, రిటైల్ ఇన్వెస్టర్లు ఇప్పుడు తమ పోర్ట్ఫోలియోలో భౌగోళిక రాజకీయ రిస్క్ ను తట్టుకోవడానికి వెండి కంటే బంగారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.
More From GoodReturns

ఇరాన్ యుద్ధం.. హార్ముజ్ జలసంధిపై టెహ్రాన్ కీలక ప్రకటన.. ట్రంప్కు గట్టి వార్నింగ్

యుద్దంపై ఇరాన్ కీలక ప్రకటన.. భారీ సైనిక దాడులు చేస్తామంటున్న ట్రంప్.. అసలేం జరుగుతోంది..

పాకిస్తాన్లా బ్రోకర్ పనులు భారత్ ఎప్పటికీ చేయదు.. ట్రంప్తో ఫోన్లో ప్రధాని మోదీ మాట్లాడారు: జైశంకర్

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

అమెరికాకు భారీ షాకిచ్చిన ఇరాన్.. 4 వేల మైళ్ల దూరం నుంచి డియాగో గార్సియా సైనిక స్థావరంపై దాడి..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

అమెరికా నష్టపరిహారం ఇచ్చేదాకా యుద్ధం ఆపే సమస్యే లేదు.. సూటిగా వార్నింగ్ ఇచ్చిన ఇరాన్..

ఇరాన్ యుధ్ధం.. హార్ముజ్ జలసంధిని దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు.. ఎలా సాధ్యమయిందంటే..

ఇరాన్ యుద్దం.. భారీగా పెరిగిన డీజిల్ ధరలు.. ఇప్పుడు ఎంతకు చేరిందంటే..

ఇరాన్ను ఎదిరించలేని పిరికిపందలు..మీ చావు మీరు చావాలంటూ నాటో దేశాలపై విరుచుకుపడిన ట్రంప్..

ట్రంప్ మరో భారీ స్కెచ్.. ఇరాన్ హార్ట్ అయిన ఖర్గ్ ద్వీపంపై కన్ను.. ఏ క్షణమైనా మిసైళ్లతో దాడి..



Click it and Unblock the Notifications