ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు కేవలం ఒక సాధారణ విలువైన లోహంగా మాత్రమే గుర్తింపు పొందిన వెండి (Silver), ఇప్పుడు తన రూపురేఖలను మార్చుకుంటోంది. 2026 నాటికి వెండి ధర (Silver price) , దాని వినియోగంలో ఒక ప్రాథమిక మార్పు కనిపిస్తోంది. వెండి ఇప్పుడు కేవలం అలంకరణ వస్తువు కాదు, గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ , డిజిటల్ ఎకానమీకి ఒక కీలకమైన ఇంజిన్ గా మారుతోంది.

పరిశ్రమలకు వెండి ఎందుకు ముఖ్యం?
వెండికి ఉన్న అద్భుతమైన విద్యుత్ , ఉష్ణ వాహకత (Electrical and Thermal properties) వల్ల దీనిని 'రేర్ ఎర్త్' మూలకాలతో సమానంగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్ తయారీ, ఎలక్ట్రానిక్స్ , ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగంలో వెండి వినియోగం విపరీతంగా పెరిగింది. అమెరికా వంటి దేశాలు ఇప్పటికే వెండిని 'క్రిటికల్ మినరల్స్' జాబితాలో చేర్చాయంటే దీని ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. పారిశ్రామిక వృద్ధి పెరిగినప్పుడల్లా వెండికి గిరాకీ పెరగడం సహజం.
భారత్: వెండి వినియోగంలో రారాజు
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ మార్పులో భారత్ కేంద్ర బిందువుగా మారుతోంది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వెండి వినియోగదారులలో ఒకటి. మన దేశంలో వెండికి సాంస్కృతిక ప్రాధాన్యత కూడా ఎక్కువే. ముఖ్యంగా భారతీయ రైతులు వెండిని తమ 'బెస్ట్ ఫ్రెండ్'గా భావిస్తారు. కరువు కాటకాలు లేదా వరదలు వచ్చినప్పుడు, కష్టకాలంలో ఆదుకునే ఆపద్బాంధవుడిగా వెండి నిలుస్తుంది. ఇటీవల వెండి ఈటీఎఫ్లు (ETFs) అందుబాటులోకి రావడంతో పట్టణ ఇన్వెస్టర్లు కూడా వెండిపై మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా దేశీయంగా వెండి ధర (Silver price) కిలోకు రూ.2.3 లక్షల నుండి రూ.2.6 లక్షల మధ్య ఊగిసలాడుతోంది.
సరఫరాలో లోటు.. డిమాండ్ లో జోరు
ప్రపంచవ్యాప్తంగా వెండి ఉత్పత్తిలో లోటు (Structural Deficit) కనిపిస్తోంది. వెండి నేరుగా గనుల నుంచి రావడం కంటే, సీసం, జింక్, రాగి , బంగారం వెలికితీతలో ఉప-ఉత్పత్తి (By-product) గానే ఎక్కువగా వస్తుంది. దీనివల్ల మార్కెట్లో వెండి ధర పెరిగినంత వేగంగా దాని ఉత్పత్తి పెరగదు. ఈ సరఫరా కొరత వల్ల వెండి ధరలు దీర్ఘకాలంలో స్థిరంగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్లోని 'హిందుస్థాన్ జింక్ లిమిటెడ్' వంటి కంపెనీలు వెండి ఉత్పత్తిని పెంచడం ద్వారా గ్లోబల్ మార్కెట్ లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
వెండి ఒక వ్యూహాత్మక ఆస్తి
దశాబ్దాల కాలంగా బంగారం వెనుకే ఉన్న వెండి, ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటోంది. పారిశ్రామిక అవసరాలు , ఇన్వెస్టర్ల ఆసక్తి కలగలిసి వెండిని ఒక 'స్ట్రాటజిక్ అసెట్'గా మార్చేశాయి. గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను చేరుకోవడంలో వెండి పాత్ర వెలకట్టలేనిది. భారత్ వంటి దేశాలకు ఇది ఒక గొప్ప అవకాశం. అటు వినియోగదారుగా, ఇటు ఉత్పత్తిదారుగా భారత్ ప్రపంచ సిల్వర్ మార్కెట్ ను శాసించే స్థాయికి చేరుకుంటోంది. ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోలో వెండిని చేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో మంచి లాభాలను ఆశించవచ్చు.
More From GoodReturns

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications