రోజుకు రూ.200 ఇన్వెస్ట్ చేస్తే 14 లక్షలు.. స్కీం గురించి తెలుసుకోండి..
చిన్న మొత్తంతో పొదుపు ప్రారంభించాలనుకునే వారికి స్మాల్ సేవింగ్స్ స్కీంకు ప్రత్యామ్నాయంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్(PPF) ఉంది. ఇక్కడ రోజుకు రూ.200 పెట్టుబడి పెట్టడం ద్వారా 20 సంవత్సరాల్లో రూ.14 లక్షలు తీసుకోవచ్చు. చిన్న పొదుపు పథకానికి ప్రత్యామ్నాయమైన ఈ అకౌంట్ ద్వారా తక్కువ పెట్టుబడితో పెద్ద మొత్తాన్ని జమ చేసుకోవచ్చు.
పీపీఎఫ్ ప్రయోజనాలతో పాటు పీపీఎఫ్ పథకం కింద మీ పెట్టుబడిపై భద్రత హామీ ఉంటుంది. ఈ పథకం కింద వచ్చిన వడ్డీపై ఆదాయపు పన్ను ఉండదు. నామినీని ఎంచుకోవచ్చు. పోస్టాఫీస్లు, బ్యాంకుల్లో 15 సంవత్సరాలకు గాను ఈ ఖాతా తెరవవచ్చు. మరో 5 సంవత్సరాలు పొడిగించుకునే వెసులుబాటు ఉంది.
మరో ఆసియా అద్భుతం: చైనా కంటే తక్కువ వేతనం.. దూసుకెళ్తున్న ఆ దేశం
ప్రయోజనాలు
పీపీఎఫ్ స్కీం కింది ఈఈ పీపీఎఫ్ ఖాతాపై పెట్టుబడికి భద్రత హామ ఉంటుంది.
ఈ పథకం కింద వచ్చిన వడ్డీ మీద ఆదాయపు పన్ను ఉండదు.
నామినీని ఎంచుకోవచ్చ.
ఎంపిక చేసిన పోస్టాఫీస్లు, బ్యాంకుల్లో ఈ ఖాతాను తెరువవచ్చు.
ఎంత మొత్తం అవసరం
రూ.500 మొత్తంతో ఈ ఖాతాను తెరుచుకోవచ్చు.
ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 ఇన్వెస్ట్ చేయాలి.
సంవత్సరంలో గరిష్టంగా రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు.
ఈ ఖాతాలోని వడ్డీ రేట్లను ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుంది.
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వడ్డీ రేటును 7.1 శాతంగా నిర్ణయించింది.
రూ.14 లక్షలు..
ఈ పథకం కింద రోజుకు రూ.200 ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ.6000 అవుతుంది. అంటే ఏడాదికి రూ.72,000 అవుతుంది. ఇలా పదిహేనేళ్లు ఇన్వెస్ట్ చేస్తే రూ.10,80,000 అవుతుంది. 20 సంవత్సరాల పాటు ఒకే వడ్డీ రేటుతో వడ్డీ ఇస్తే మొత్తం రాబడి రూ.14.40 లక్షలు వస్తుంది. మీ పెట్టుబడిపై అదనపు ప్రయోజనం ఉంటుంది.