అక్టోబర్ 1, 2025 నుండి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) వినియోగంలో కీలక మార్పు అమలులోకి రాబోతోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల్లో ప్రకారం.. Money Request ఫీచర్ను పూర్తిగా తీసి వేస్తున్నట్లు తెలిపింది. ఇది ముఖ్యంగా భద్రతా దృష్టితో తీసుకున్న నిర్ణయం అని తెలిపింది. వినియోగదారుల డిజిటల్ చెల్లింపుల దశలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కానుందని NPCI ప్రకటన స్పష్టం చేసింది.
చెల్లింపుల కోసం అభ్యర్థన పంపే ఈ ఫీచర్ మొదట్లో వినియోగదారులకు అనుకూలమైన ఎంపికగా భావించబడింది. ఉదాహరణగా చెప్పాలంటే.. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత బాకీ ఉన్న డబ్బును గుర్తు చేయడానికి డబ్బు అభ్యర్థన పంపడం వినియోగదారులకు వేగవంతమైన సదుపాయంగా ఉండేది. అలాగే ఈ మెసేజ్ అందుకున్న గ్రహీతకు అమోదించు / తిరస్కరించు అన్న ఎంపిక కూడా ఉంటుంది. అయితే ఈ సదుపాయం ప్రస్తుతం మోసగాళ్ల చేతిలో ప్రమాదకర సాధనంగా మారింది.

NPCI పరిశీలనల ప్రకారం.. కొద్ది కాలంగా ఫేక్ లేదా ఫిషింగ్ రిక్వెస్టులు వేగంగా పెరిగాయని తెలుస్తోంది. వినియోగదారులు నిజమైన అభ్యర్థనగా భావించి అమోదించడం ద్వారా అనుకోకుండా తమ ఖాతాలనుంచి నగదును మోసగాళ్లకు పంపే ఘటనలు చాలా చోట్ల చోటు చేసుకున్నాయి. దీనికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో NPCI ఈ ఫీచర్ను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. NPCI అన్ని బ్యాంకులు, పేమెంట్ సేవా ప్రదాతలు, UPI యాప్లకు పంపిన నోటిఫికేషన్లో..అక్టోబర్ 1, 2025 నుండి ఎలాంటి P2P కలెక్షన్ రిక్వెస్ట్ ప్రాసెస్ చేయకూడదని స్పష్టం చేసింది. యాప్లు, బ్యాంకింగ్ ప్లాట్ఫారమ్లు తమ వ్యవస్థలను ఈ మార్పుకు అనుగుణంగా ఆధునీకరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే ఇది UPI వినియోగదారులకు పెద్ద ఆటంకంగా మారదని NPCI చెబుతోంది.
ఇక డబ్బు పంపడానికి అవసరమైన ప్రధాన ఫీచర్లు అన్నీ అలాగే కొనసాగుతాయని స్పష్టం చేసింది. UPI ID లేదా మొబైల్ నంబర్ ద్వారా తక్షణ చెక్కులేని బదిలీలు, QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా చెల్లింపులు, ధృవీకరించబడిన వ్యాపారుల నుండి వచ్చే రిక్వెస్టులను స్వీకరించే అవకాశం వంటివి కొనసాగుతాయి. ఇకపై డబ్బు అభ్యర్థించాలంటే, రిక్వెస్ట్ బటన్ వాడకుండా తమ UPI IDను పంపించడం, QR కోడ్ను షేర్ చేయడం లేదా స్వయంగా రిమైండర్ మెసేజ్ పంపడం కాని చేయాలి.
UPI ప్రస్తుతం నెలకు బిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేస్తున్నఏకైక డిజిటల్ చెల్లింపు వ్యవస్థ. వేగం, సౌలభ్యం, కొంతవరకు ఆర్టిఫిషియల్ ట్రస్టు ఆధారంగా ఇది ప్రజల జీవనశైలిలో భాగమైంది. అదే సమయంలో.. మోసగాళ్లు కూడా UPIని లక్ష్యంగా చేసుకుని ఫిషింగ్ టెక్స్ట్లనుండి నకిలీ OTP మెసేజ్లవరకు అనేక రకాల ఫేక్ పాయింట్లను ఉపయోగించారు. Money Request ఫీచర్ కూడా అలాంటి ఒక లూప్హోల్గా వారికి మారింది.NPCI ప్రకారం.. సమస్య మరింత తీవ్రమయ్యే ముందు సరైన చర్య తీసుకోవడమే ఈ మార్పు వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం అని తెలిపింది.
క్లుప్తంగా చెప్పాలంటే, అక్టోబర్ 1 నుండి UPIలో డబ్బు అభ్యర్థన అనే షార్ట్కట్ మాయమవుతుంది. దీంతో పాటుగా సడన్ గా నగదు పోయే ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుంది. కొంచెం అదనపు శ్రమ పెరిగినా, భవిష్యత్తులో UPI మరింత సురక్షితంగా ప్రయోజనాలను అందించడానికి ఇది ఒక కీలక ముందడుగు కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications