అక్టోబర్ 1, 2025 నుండి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) వినియోగంలో కీలక మార్పు అమలులోకి రాబోతోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల్లో ప్రకారం.. Money Request ఫీచర్ను పూర్తిగా తీసి వేస్తున్నట్లు తెలిపింది. ఇది ముఖ్యంగా భద్రతా దృష్టితో తీసుకున్న నిర్ణయం అని తెలిపింది. వినియోగదారుల డిజిటల్ చెల్లింపుల దశలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కానుందని NPCI ప్రకటన స్పష్టం చేసింది.
చెల్లింపుల కోసం అభ్యర్థన పంపే ఈ ఫీచర్ మొదట్లో వినియోగదారులకు అనుకూలమైన ఎంపికగా భావించబడింది. ఉదాహరణగా చెప్పాలంటే.. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత బాకీ ఉన్న డబ్బును గుర్తు చేయడానికి డబ్బు అభ్యర్థన పంపడం వినియోగదారులకు వేగవంతమైన సదుపాయంగా ఉండేది. అలాగే ఈ మెసేజ్ అందుకున్న గ్రహీతకు అమోదించు / తిరస్కరించు అన్న ఎంపిక కూడా ఉంటుంది. అయితే ఈ సదుపాయం ప్రస్తుతం మోసగాళ్ల చేతిలో ప్రమాదకర సాధనంగా మారింది.

NPCI పరిశీలనల ప్రకారం.. కొద్ది కాలంగా ఫేక్ లేదా ఫిషింగ్ రిక్వెస్టులు వేగంగా పెరిగాయని తెలుస్తోంది. వినియోగదారులు నిజమైన అభ్యర్థనగా భావించి అమోదించడం ద్వారా అనుకోకుండా తమ ఖాతాలనుంచి నగదును మోసగాళ్లకు పంపే ఘటనలు చాలా చోట్ల చోటు చేసుకున్నాయి. దీనికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో NPCI ఈ ఫీచర్ను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. NPCI అన్ని బ్యాంకులు, పేమెంట్ సేవా ప్రదాతలు, UPI యాప్లకు పంపిన నోటిఫికేషన్లో..అక్టోబర్ 1, 2025 నుండి ఎలాంటి P2P కలెక్షన్ రిక్వెస్ట్ ప్రాసెస్ చేయకూడదని స్పష్టం చేసింది. యాప్లు, బ్యాంకింగ్ ప్లాట్ఫారమ్లు తమ వ్యవస్థలను ఈ మార్పుకు అనుగుణంగా ఆధునీకరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే ఇది UPI వినియోగదారులకు పెద్ద ఆటంకంగా మారదని NPCI చెబుతోంది.
ఇక డబ్బు పంపడానికి అవసరమైన ప్రధాన ఫీచర్లు అన్నీ అలాగే కొనసాగుతాయని స్పష్టం చేసింది. UPI ID లేదా మొబైల్ నంబర్ ద్వారా తక్షణ చెక్కులేని బదిలీలు, QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా చెల్లింపులు, ధృవీకరించబడిన వ్యాపారుల నుండి వచ్చే రిక్వెస్టులను స్వీకరించే అవకాశం వంటివి కొనసాగుతాయి. ఇకపై డబ్బు అభ్యర్థించాలంటే, రిక్వెస్ట్ బటన్ వాడకుండా తమ UPI IDను పంపించడం, QR కోడ్ను షేర్ చేయడం లేదా స్వయంగా రిమైండర్ మెసేజ్ పంపడం కాని చేయాలి.
UPI ప్రస్తుతం నెలకు బిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేస్తున్నఏకైక డిజిటల్ చెల్లింపు వ్యవస్థ. వేగం, సౌలభ్యం, కొంతవరకు ఆర్టిఫిషియల్ ట్రస్టు ఆధారంగా ఇది ప్రజల జీవనశైలిలో భాగమైంది. అదే సమయంలో.. మోసగాళ్లు కూడా UPIని లక్ష్యంగా చేసుకుని ఫిషింగ్ టెక్స్ట్లనుండి నకిలీ OTP మెసేజ్లవరకు అనేక రకాల ఫేక్ పాయింట్లను ఉపయోగించారు. Money Request ఫీచర్ కూడా అలాంటి ఒక లూప్హోల్గా వారికి మారింది.NPCI ప్రకారం.. సమస్య మరింత తీవ్రమయ్యే ముందు సరైన చర్య తీసుకోవడమే ఈ మార్పు వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం అని తెలిపింది.
క్లుప్తంగా చెప్పాలంటే, అక్టోబర్ 1 నుండి UPIలో డబ్బు అభ్యర్థన అనే షార్ట్కట్ మాయమవుతుంది. దీంతో పాటుగా సడన్ గా నగదు పోయే ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుంది. కొంచెం అదనపు శ్రమ పెరిగినా, భవిష్యత్తులో UPI మరింత సురక్షితంగా ప్రయోజనాలను అందించడానికి ఇది ఒక కీలక ముందడుగు కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications