ఆ ఉద్యోగులకు శుభవార్త, రూ.5,000 పెరగనున్న వేతనం!
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వేస్ నాన్ గెజిటెడ్ మెడికల్ ఉద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం వారికి తీపి కబురు అందిస్తోంది. ఉద్యోగుల వేతనాన్ని రూ.5,000 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వంలోని రైల్వేస్ నాన్ గెజిటెడ్ మెడికల్ ఎంప్లాయీస్కు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ మేరకు వారికి ప్రమోషన్ను రైల్వే బోర్డు అప్రూవ్ చేసింది. ప్రమోషన్ తర్వాత 8 కేటగిరీల్లోని నాన్ గెజిటెడ్ మెడికల్ ఉద్యోగుల వేతనం కనీసం రూ.5వేలు పెరుగుతుంది.
రూ.55,700 కోట్లు... ఈక్విటీలలో సగానికి తగ్గిన MF పెట్టుబడులు
వేతనంతో పాటు వీటిలో పెరుగుదల
స్టాఫ్ నర్సు, ఫార్మాసిస్ట్, రేడియో గ్రాఫర్, ల్యాబ్ స్టాఫ్, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్, ఫిజియోథెరఫిస్ట్, డైటీషియన్, ఫ్యామిలీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వంటి 8 కేటగిరీల్లోని నాన్ గెజిటెడ్ మెడికల్ ఉద్యోగుల వేతనం పెరగనుంది. అలాగే ఉద్యోగులకు ప్రమోషన్ కారణంగా హెచ్ఆర్ఏ, టీఏ, డీఏ కూడా పెరగనుంది.
ఆ తర్వాతే ప్రమోషన్ పైన నిర్ణయం
జోనల్ రైల్వేస్, సంబంధిత విభాగాలతో సంప్రదింపుల అనంతరం నాన్ గెజిటెడ్ కేటగిరీలోని ఉద్యోగుల ప్రమోషన్ పైన నిర్ణయం తీసుకున్నామని రైల్వే బోర్డు తెలిపింది. అయితే మెడికల్ ల్యాబోరేటరీ కేటగిరీలో కేడర్ స్ట్రక్చర్ రివ్యూ ఇంకా ఫైనలైజ్ కాలేదని తెలిపింది. ఇది పూర్తయ్యాక వీరికి కూడా ఏవీసీ (అవెన్యూ ఆఫ్ ప్రమోషన్) వర్తిస్తుందని పేర్కొంది.
ఉద్యోగుల లెవల్ పెరిగి..
ప్రమోషన్ అనంతరం ఉద్యోగులు ఓ స్థాయి పైకి చేరుకుంటారు. ఉద్యోగి లెవల్ వన్ నుంచి లెవల్ టూకు లేదా లెవల్ టూ నుంచి లెవల్ త్రీకి.. ఇలా పైకి చేరుకుంటారు. అప్పుడు సదరు ఉద్యోగి కనీస వంతనం ఐదువేల రూపాయలు పెరుగుతుంది.