ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా, రూ.21 లక్షల వరకు ఆదా!
టాటా హౌసింగ్ ఇంటి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. హోం బయ్యర్స్కు ఆనందం కలిగించేలా నేషనల్ ఫ్లాష్ సేల్ను ప్రకటించింది. ఫైనల్ రష్ సేల్ కింద దేశవ్యాప్తంగా 15 ప్రాజెక్టుల్లో, 150 యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి డిస్కౌంట్ పైన లభిస్తాయి. ఈ ఇళ్ల అమ్మకాలు మార్చి 12వ తేదీ నుండి ప్రారంభమవుతున్నాయి. అంటే రేపటి నుండి (శుక్రవారం) ప్రారంభమవుతున్నాయి. 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి.
గుడ్న్యూస్, వచ్చే క్వార్టర్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయ్
రూ.లక్షలు ఆదా చేయవచ్చు
ఈ ప్రాజెక్టులో రూ.20 లక్షల నుండి రూ.6 కోట్ల వరకు అందుబాటులో ఉన్నాయి. మూడు రోజుల పాటు అందుబాటులో ఉండే ఈ సేల్ ఎంతోమందికి ఆఫర్లో లభిస్తుంది. ఈ ఫ్లాష్ సేల్లో భాగంగా కొనుగోలు చేసే వారు రూ.2 లక్షల నుండి రూ.21 లక్షల వరకు ఆదా చేయవచ్చు. ఈ సేల్లో కొనుగోలు ద్వారా లక్షల రూపాయలు సేవ్ చేయవచ్చునని టాటా హౌసింగ్ ఓ ప్రకటనలో తెలిపింది.
కొనుగోలుదారులకు ప్రయోజనం
ఇటీవల మహారాష్ట్ర, ఆ తర్వాత కర్ణాటక ప్రభుత్వాలు హౌసింగ్ సేల్స్ పెంచే చర్యల్లో భాగంగా స్టాండ్ డ్యూటీని మూడు శాతం మేర తగ్గించాయి. రూ.35 లక్షల నుండి రూ.45 లక్షల కేటగిరీ ఇళ్లపై ఈ తగ్గింపును ఇచ్చాయి. ఇది రియాల్టీకి ఊతమిచ్చే చర్య. కర్ణాటక ప్రభుత్వం రూ.21 లక్షల నుండి రూ.35 లక్షల ఇళ్లపై మే 2020న స్టాంప్ డ్యూటీన 5 శాతం నుండి 3 శాతానికి తగ్గించింది.
మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీపై 1 శాతం కన్సెషన్ ఇచ్చింది. ఇప్పుడు టాటా హౌసింగ్ కూడా రియాల్టీకి ఊతమిచ్చేలా కస్టమర్లకు రూ.21 లక్షల వరకు ప్రయోజనం కల్పించే ప్రకటన చేసింది.
వరుసగా గుడ్ న్యూస్
ఇటీవల ఇంటి కొనుగోలుదారులకు వరుసగా ప్రయోజనకర ప్రకటనలు వస్తున్నాయి. ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), ప్రయివేటురంగ దిగ్గజం HDFC, ICICI, కొటక్ మహీంద్రా తదితర బ్యాంకులు హోమ్ బయ్యర్స్కు వడ్డీ రేట్లను తగ్గించాయి.