sukanya samriddhi yojana: కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం తీసుకొచ్చిన సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకం.. తక్కువ పెట్టుబడితోనే మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కూతురి చదువు, పెళ్లి ఖర్చుల కోసం ఈ ఫండ్ పనికొస్తుంది. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పట్నుంచే ఇందులో పెట్టుబడి పెట్టడం మొదలుపెడితే వాళ్లు పెద్దయ్యే నాటికి పెద్దమొత్తంలో డబ్బు చేతికొస్తుంది. ఇందులో ఎంత పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేటు ఎంత? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
స్కీమ్ డీటెయిల్స్
సుకన్య సమృద్ధి యోజన ప్రస్తుతం 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. పోస్ట్ ఆఫీస్ పథకాలన్నింటిలో ఇదే ఎక్కువ వడ్డీ ఇచ్చే స్కీమ్. ఇందులో రూ. 250 నుంచి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే దీన్ని ఏడాదికోసారి కట్టాల్సి ఉంటుంది. 15 ఏళ్ల పాటు డిపాజిట్ చేస్తూ పోతే 21 ఏళ్లకు మెచ్యూరిటీ అవుతుంది. తర్వాత ఒకేసారి డబ్బు చేతికొస్తుంది.
70 లక్షలు రావాలంటే..
ఈ స్కీమ్ లో ఏడాదికి రూ.1.5 లక్షలు పెట్టుబడి పెడితే 21 ఏళ్లు వచ్చేసరికి రూ.72 లక్షల నిధి సమకూరుతుంది. ఏడాదికి రూ.1.5 లక్షల చొప్పున 15 ఏళ్ల పాటు డిపాజిట్ చేస్తే.. మీరు డిపాజిట్ చేసిన మొత్తం రూ. 22.5 లక్షలు అవుతుంది. దీనికి అదనంగా రూ. 49 లక్షల వడ్డీ(8.2% చొప్పున) యాడ్ అవుతుంది. అలా మొత్తంగా మీరు రూ.72 లక్షల నిథిని సమకూర్చుకోవచ్చు. అయితే ఇందులో మెచ్యూరిటీ 21 ఏళ్లకు ఉంటుంది. కానీ, మీరు 15 ఏళ్ల పాటు మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 6 ఏళ్లు ఎలాంటి పెట్టుబడి పెట్టకుండానే వడ్డీ లభిస్తుంది. ఏడాదికి రూ.1.5 లక్షలు అంటే నెలకు సుమారు రూ.12,500 అవుతుంది..

స్కీమ్ లక్ష్యం ఇదే..
సుకన్య సమృద్ధి యోజన అనేది 'బేటీ బచావో బేటీ పఢావో' ప్రచారంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం ప్రారంభించిన పథకం. ఆడపిల్లలకు చదువు, పెళ్లి కొసం అయ్యే ఖర్చులను తీర్చడం కోసం ఈ స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చారు. సుకన్య సమృద్ధి యోజనలో ఇప్పటివరకు 4 కోట్లకు పైగా ఖాతాలు తెరవబడ్డాయని ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. అలాగే ఈ స్కీమ్ లో ఇప్పటివరకూ రూ. 3.25 లక్షల కోట్ల కంటే ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేశారు.
ఇలా ప్లాన్ చేసుకోండి!
ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందాలంటే.. ఆడపిల్ల పుట్టగానే పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టండి. అలా 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీ చేతికి పెద్ద మొత్తంలో ఫండ్ అందుతుంది. ఏడాదికి రూ.1.5 లక్షలు పెట్టలేకపోతే అందులో సగం రూ.75 వేల చొప్పున అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. అప్పుడు స్కీమ్ మెచ్యూరిటీ సమయానికి రూ.36 లక్షలు వస్తుంది. ఇకపోతే ఈ స్కీమ్ కు ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications