ఇండియాలో 20 బ్రాంచ్‌లను మూసివేస్తున్న స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్.. సంపన్నులే టార్గెట్‌గా కొత్త వ్యూహం..

బ్రిటిష్ బ్యాంకింగ్ దిగ్గజం స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ గత ఏడాది కాలంలో భారతదేశంలో తన వ్యూహాత్మక మార్పుల్లో భాగంగా శాఖల సంఖ్యను 100 నుండి 80కి తగ్గించుకుంది. దేశీయ మార్కెట్లో మారుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ బ్యాంక్ ఇప్పుడు సాధారణ రిటైల్ బ్యాంకింగ్ సేవల కంటే వెల్త్ మేనేజ్‌మెంట్, సంపన్న ఖాతాదారుల (Affluent Customers) విభాగానికి సంబంధించిన సలహా సేవలపై ఎక్కువ శ్రద్ధ వహిస్తోంది.

అయినప్పటికీ భారతదేశంలో లోకల్ సబ్సిడరీ (అనుబంధ సంస్థ) రూపంలో కాకుండా నేరుగా వ్యాపారం చేస్తున్న విదేశీ బ్యాంకుల్లో స్టాండర్డ్ చార్టర్డ్ ఇప్పటికీ అతిపెద్ద బ్రాంచ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు. బ్యాంకింగ్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించే క్రమంలో నగరాల్లో ఒకే విధమైన పనుల కోసం పక్కపక్కనే ఉన్న కొన్ని శాఖలను బ్యాంక్ విలీనం (Consolidate) చేసింది. అయితే ఈ శాఖలను మూసివేసినప్పటికీ వాటికి సంబంధించిన లైసెన్సులను బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ అయిన ఆర్‌బీఐ (RBI) కి తిరిగి అప్పగించకుండా.. భవిష్యత్తులో ఇతర వృద్ధి కేంద్రాల్లో వాటిని ఉపయోగించుకునే అవకాశాలను బ్యాంక్ పరిశీలిస్తోంది.

20 Standard Chartered StanChart Standard Chartered India India branches branch closures wealth management private banking retail banking banking sector bank branches India banking financial services affluent banking digital banking banking news RBI India finance wealth business banking strategy financial news

ప్రస్తుతం స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఒకే-ఉత్పత్తి విధానం నుండి బహుళ-ఉత్పత్తి విధానానికి మారుతూ సంపన్న, చిన్న, మధ్య తరహా (SME) వ్యాపారాల వృద్ధికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది. ఈ వ్యూహంలో భాగంగానే తన ప్రస్తుత శాఖల్లో ఉన్న 'ప్రాధాన్యతా కేంద్రాల' (Priority Centers) నెట్‌వర్క్‌ను ప్రస్తుతమున్న 20 నుండి 2026 చివరి నాటికి సుమారు 30కి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కస్టమర్లకు అంతర్జాతీయ స్థాయి బ్యాంకింగ్ అనుభవాన్ని అందించేందుకు సాంకేతికతను ఉపయోగించుకోవడంతో పాటు రిలేషన్‌షిప్ మేనేజర్ల సంఖ్యను పెంచడంపై భారీగా పెట్టుబడులు పెడుతోంది.

Also Read

గత కొన్నేళ్లుగా స్టాండర్డ్ చార్టర్డ్ తన రిటైల్ ఆస్తులను విక్రయిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా తన పర్సనల్ లోన్ వ్యాపారానికి సంబంధించిన సుమారు రూ. 4,100 కోట్ల బకాయి రుణాలను కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు విక్రయించగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో దాదాపు 4.5 లక్షల మంది క్రెడిట్ కార్డ్ కస్టమర్లను ఫెడరల్ బ్యాంక్‌కు బదిలీ చేయాలని నిర్ణయించింది. అయితే కార్డ్ వ్యాపారం నుండి బ్యాంక్ పూర్తిగా వైదొలగడం లేదు.. ఎందుకంటే పలు ఇతర సేవల కింద ఇప్పటికీ 1.5 లక్షల నుండి 2.5 లక్షల వరకు కార్డులను తన వద్దే ఉంచుకుంది.

భారతదేశంలో గృహ రుణాలు (తనఖాలు), అసురక్షిత రుణాల విభాగాలలో దేశీయ బ్యాంకుల నుండి ఎదురవుతున్న తీవ్రమైన పోటీ కారణంగా ఇటీవలి కాలంలో విదేశీ బ్యాంకులు తమ రిటైల్ వ్యాపారాలను విక్రయించుకుంటున్నాయి. ఉదాహరణకు 2023లో సిటీ బ్యాంక్ తన భారతీయ వినియోగదారుల వ్యాపారాన్ని (క్రెడిట్ కార్డులు, రిటైల్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్‌మెంట్) రూ. 11,603 కోట్లకు యాక్సిస్ బ్యాంక్‌కు విక్రయించింది.

అలాగే, డాయిచే బ్యాంక్ కూడా భారతదేశంలోని తన రిటైల్ బ్యాంకింగ్, ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యాపారాలను కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు రూ. 282 కోట్లకు విక్రయించడానికి నిర్ణయించుకుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా మరొక విదేశీ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌ఎస్‌బిసి (HSBC) మాత్రం భిన్నమైన వ్యూహాన్ని అవలంబించింది. గతంలో 2016లో తన శాఖలను 50 నుండి 26కి తగ్గించుకున్న ఈ బ్యాంక్.. తిరిగి 2025లో అమృత్‌సర్, భోపాల్, భువనేశ్వర్ వంటి కీలక నగరాల్లో కొత్తగా 20 శాఖలను తెరవాలని నిర్ణయించడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+