దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం (అక్టోబర్ 7) భారీ లాభాల్లో ముగిశాయి. గతవారం భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, ఈ వారం రెండు ప్రారంభ సెషన్లలో లాభపడ్డాయి. సోమ, మంగళవారం సెషన్స్లో సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా లాభపడినప్పటికీ, నిన్నటి సెషన్లో 500 పాయింట్లకు పైగా నష్టపోయింది. నేడు తిరిగి లాభాల్లోకి వచ్చింది. నిన్నటి నష్టాలు నేడు దాదాపు రికవరీ అయ్యాయి. ప్రధానంగా రియాల్టీ, ఆటో స్టాక్స్, టీసీఎస్, టైటాన్ స్టాక్స్ భారీ లాభాలకు కారణమయ్యాయి. ఆటో, రియాల్టీలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. దీంతో సెన్సెక్స్ 59,600 పాయింట్లను దాటగా, నిఫ్టీ 17,800 పాయింట్లకు చేరువైంది. సెన్సెక్స్, నిఫ్టీ చెరో 0.82 శాతం లాభపడ్డాయి.

అందుకే లాభాల్లోకి మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్ నుండి సానుకూల సంకేతాల కారణంగా ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. అలాగే, ఆర్బీఐ ద్రవ్య విధాన పరపతి సమీక్ష, ఈ నెలలో వెలువడనున్న కంపెనీల త్రైమాసిక ఫలితాల పట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఫైనాన్స్, ఆటోమొబైల్, రియల్టీ రంగాల షేర్లు రాణించడంతో సూచీలు రోజంతా లాభాల్లో కనిపించాయి.
చమురు, గ్యాస్ రంగాలు మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు రాణించాయి. నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఆటో సూచీలు 4 శాతం నుండి 6 శాతం మేర లాభపడ్డాయి. టైటాన్ స్టాక్ అయితే పది శాతానికి పైగా లాభపడింది. ఈ స్టాక్ నేడు రూ.226 పెరిగి రూ.2,374 వద్ద ముగిసింది. మార్కెట్లు గతవారం భారీగా నష్టపోయిన మార్కెట్లు, నేడు కాస్త ఊగిసలాటలో కనిపిస్తున్నాయి.

ఈ స్టాక్స్ జంప్
ఉదయం 59,632.81 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 59,914.91 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,597.06 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. 17,810.55 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ, 17,857.55 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,763.80 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 488.10 (0.82%) పాయింట్లు లాభపడి 59,677.83 పాయింట్ల వద్ద, నిఫ్టీ +144.35 (0.82%) పాయింట్లు ఎగిసి 17,790.35 పాయింట్ల వద్ద ముగిసింది.
ఎన్ఎస్ఈలో టాటా మోటార్స్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, ఐచర్ మోటార్స్ భారీగా లాభపడ్డాయి. ఓఎన్జీసీ, రెడ్డీస్ ల్యాబ్స్, కోల్ ఇండియా, బ్రిటానియా, HDFC షేర్లు నష్టపోయాయి. 30 స్టాక్స్లో పది స్టాక్స్ నష్టపోగా, 20 స్టాక్స్ లాభపడ్డాయి.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్ 12.04 శాతం, టైటాన్ కంపెనీ 10.60 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 5.29 శాతం, మారుతీ సుజుకీ 4.07 శాతం, ఐచర్ మోటార్స్ 3.37 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఓఎన్జీసీ 4.58 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 1.32 శాతం, కోల్ ఇండియా 1.11 శాతం, బ్రిటానియా 0.96 శాతం, HDFC 0.87 శాతం నష్టపోయాయి.

ఈ స్టాక్స్ జంప్
నేడు ఓ సమయంలో పలు స్టాక్స్ పదిహేను శాతం మేర లాభపడ్డాయి. వైట్ ఆర్గానిక్ ఆగ్రో (20.0%), నాధనా నైట్రో (20.0%), అంబికా అగరబత్తీస్ & అరోమా ఇండస్ట్రీస్ లిమిటెడ్ (20.0%), నీల్ ఇండస్ట్రీస్ (20.0%), బనారస్ బీడ్స్ (20.0%), న్యూరేకా లిమిటెడ్ (20.0%), DRC సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (19.99%), తేజ్ నక్ష్ హెల్త్ కేర్ (19.98%), పాలీమెక్ మ్యాక్ (19.98%) వాస్వాని ఇండ్ (19.96%) లాభపడ్డాయి.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications