చాలామంది రిటైర్మెంట్ తర్వాత సంతోషంగా తిని కూర్చోవాలనుకుంటారు. అందుకోసం ముందు జాగ్రత్తగా ఏదైనా ఇన్వెస్ట్ మెంట్ చేసి రిటైర్ అయ్యేనాటికి ఆ డబ్బులు చేతికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు. భవిష్యత్తులో తమ లక్ష్యాన్ని సాధించడానికి చాలామంది మ్యూచువల్ ఫండ్లలో SIPని ఆశ్రయిస్తారు. మరి కొంతమంది ఎటువంటి రిస్క్ తీసుకోనవసరం లేదని భావిస్తారు. అయినా సరే వారు ఇప్పటికీ భారీ మొత్తాన్ని పొందుతుంటారు.
ఇలాంటి వారికి ప్రభుత్వ పథకాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ కింద నిర్వహించబడే అటువంటి పథకం గురించి మీరు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పథకాన్నిమీరు మీ సమీపంలోని పోస్టాఫీసులో కూడా తెరవవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టినట్లయితే కేవలం వడ్డీ ద్వారానే మీకు చాలా డబ్బు చేతికి వస్తుంది. మీరు ఐదు ఏళ్లు దీనిలో పెట్టుబడి పెడితే కేవలం వడ్డీ ద్వారానే 82 వేల రూపాయలకు పైగా సంపాదించవచ్చు.

ఈ పథకం పేరు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS). ఈ పథకం కింద.. మీరు ఒకేసారి పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయడం ద్వారా భారీ ఆదాయాన్ని అందుకోవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అనేది ప్రభుత్వం అందించే పథకం. ఇది ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ల కోసం రూపొందించబడింది. అంటే మీరు ఈ పథకాన్ని మీ తండ్రి లేదా తాతకు బహుమతిగా కూడా ఇవ్వవచ్చు. ఈ పథకం 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి అందుబాటులో ఉంది.
ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ. 1000 నుంచి గరిష్ట పెట్టుబడి పరిమితి రూ. 30 లక్షలు వరకు పెట్టుబడిగా పెట్టవచ్చు. ఈ పథకం కింద మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలుగా ఉంటుంది. కావాలనుకుంటే మీరు దానిని మరో 3 సంవత్సరాలు పొడిగించవచ్చు. ఈ పథకం కింద 8.2 శాతం వడ్డీ ఇవ్వబడుతుంది. దీని వడ్డీ ప్రతి త్రైమాసిక ప్రాతిపదికన నిర్ణయించబడుతుంది. వార్షిక ప్రాతిపదికన వడ్డీ జారీ చేయబడుతుంది. దేశంలోని ఏ సీనియర్ పౌరుడైనా ఈ ఖాతాను తెరవవచ్చు. 55 ఏళ్లు పైబడిన, 60 ఏళ్లలోపు పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే, పదవీ విరమణ ప్రయోజనాలు పొందిన 1 నెలలోపు పెట్టుబడి పెట్టాలనే షరతు ఉంటుంది.
ఈ పథకం కింద, మీరు 80C కింద రూ. 1.5 లక్షల వరకు వార్షిక పెట్టుబడిపై పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందుతారు.అయితే మీరు గడువుకు ముందే ఖాతాను మూసివేస్తే వడ్డీ రాదు. అసలు మాత్రమే వస్తుంది. ఖాతా తెరిచిన తేదీ నుండి 1 సంవత్సరం తర్వాత కానీ 2 సంవత్సరాల ముందు ఖాతాను మూసివేస్తే, అసలు మొత్తంలో 1.5%కి సమానమైన మొత్తం తీసివేయబడుతుంది. అలాగే ఖాతాను 2 సంవత్సరాల తర్వాత కానీ 5 సంవత్సరాల ముందు మూసివేస్తే, అసలు మొత్తంలో 1% కు సమానమైన మొత్తం తీసివేయబడుతుంది. పొడిగించిన ఖాతాను ఖాతా పొడిగింపు తేదీ నుండి ఒక సంవత్సరం గడువు ముగిసిన తర్వాత ఎటువంటి తగ్గింపు లేకుండా మూసివేయవచ్చు.
మీరు ఎవరైనా ఈ పథకంలో ఒకేసారి రూ. 20 వేలు పెట్టుబడి పెడితే, 5 సంవత్సరాల మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత, మీకు 8.2 శాతం వడ్డీ ఆధారంగా ఈ మొత్తం లభిస్తుంది. లెక్క ప్రకారం మీరు వడ్డీ ద్వారా మాత్రమే రూ. 82 వేలు అందుకుంటారు. మెచ్యూరిటీ తర్వాత మొత్తం రూ. 2,82,000 మీ చేతికి అందుతుంది. త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీ రూ. 4,099 జమ అవుతూ ఉంటుంది.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications