ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై 1 గురువారం నుండి కొత్త ఛార్జీలను అమలులోకి తెస్తోంది. పరిమితికి మించి నగదు ఉపంసహరణ మొదలు చెక్కు బుక్స్, బేసిక్ సేవింగ్స్ డిపాజిట్(BSBD) ఖాతాదారులకు అదనపు చెల్లింపులు తప్పనిసరి. ఇందుకు రూ.15 నుండి రూ.75 వరకు వసూలు చేయనున్నారు. దీనికి జీఎస్టీ అదనం. BSBD ఖాతాల ఛార్జీలను ఎస్బీఐ రేపటి నుండి సవరిస్తోంది. వీరి ఉచిత నగదు ఉపసంహరణ సదుపాయాన్ని నెలకు నాలుగుకు పరిమితం చేస్తుంది.

చెక్కుబుక్కు ఉపయోగిస్తే...
BSBD ఖాతాదారులకు ప్రస్తుతం ఏడాదికి 10 లీవ్స్ ఉండే ఒక చెక్కుబుక్ ఎస్బీఐ ఉచితంగా జారీ చేస్తోంది. జూలై 1వ తేదీ నుండి ఆ పరిమితి మించితే 10 లీవ్స్ చెక్కుబుక్కుకు రూ.40 ప్లస్ జీఎస్టీ అదనం. 25 లీవ్స్ చెక్కుబుక్కుకు రూ.75 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. అత్యవసరంగా 10 లీవ్స్ చెక్కుబుక్కు కావాలంటే BSBD ఖాతాదారులు రూ.50 ప్లస్ జీఎస్టీ చెల్లించాలి. అయితే సీనియర్ సిటిజన్లను ఈ అదనపు చెక్కుబుక్ ఛార్జీల నుండి మినహాయింపు ఇస్తుంది.

ఏటీఎం ఉపసంహరణ
BSBD ఖాతాదారులు ఏటీఎంల నుండి నెలకు నాలుగుసార్లు కంటే ఎక్కువ నగదును ఉపసంహరిస్తే ఒక్కో ట్రాన్సాక్షన్స్ పైన రూ.15 చెల్లించాలి. ఎస్బీఐ శాఖల్లో నగదు ఉపసంహరణ చేసినా ఛార్జీ వర్తిస్తుంది. అయితే బ్రాంచీల్లో, ఏటీఎం, సీడీఎంలలో నాన్-ఫైనాన్షియల్, ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్స్ ఉచితం.

మరిన్ని మార్పులు
జూలై ఒకటో తేదీ నుండి పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఎస్బీఐ చెక్కు బుక్కు, ఏటీఎం నగదు ఉపసంహరణతో పాటు మరిన్ని మార్పులు ఉండనున్నాయి. కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంకు విలీనం నేపథ్యంలో కొత్త ఐఎఫ్ఎస్సీ కోడ్ వర్తిస్తుంది. ట్రాన్సాక్షన్స్ సజావుగా జరిగేలా కొత్త ఐఎఫ్ఎస్సీ కోడ్ పొందాలని సిండికేట్ బ్యాంకు తన ఖాతాదారులకు విజ్ఞప్తి చేసింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications