SBI Alert: ఆ డాక్యుమెంట్స్ సమర్పిస్తేనే ఎస్బీఐ సేవలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కస్టమర్లు ఈ నెల చివరి నాటికి ఆధార్-పాన్ కార్డును లిక్ చేసుకోవాలి. లింక్ చేసుకోలేదంటే సేవలను నిలిపి వేయనుంది. ఈ మేరకు ఈ ప్రభుత్వరంగ దిగ్గజం స్పష్టం చేసింది. ఈ మేరకు చాలామంది కస్టమర్లకు సందేశాలు వచ్చాయి. కొందరు తమ ఖాతాల్లో భారీగా ఉన్న డబ్బును హోల్డ్లో పెట్టినట్లు బ్యాంకు నుండి వచ్చిన సందేశం చూసి ఆందోళన చెందారు.
అయితే బ్యాంకులో పాన్, ఆధార్ కార్డుతో పాటు KYC వివరాలను అప్డేట్ చేస్తే తిరిగి హోల్డ్లో పెట్టిన మొత్తం, ఖాతాను తిరిగి యాక్టివేట్ చేస్తున్నారు. పాన్ కార్డు, ఆధార్ కార్డును ఎందుకు లింక్ చేయాలో కూడా కస్టమర్లకు ఎస్బీఐ వివరించే ప్రయత్నం చేస్తోంది. పాన్ కార్డుతో ఆధార్ కార్డును ఆన్లైన్లో లింక్ చేసుకోవడానికి www.incometaxindiaefilling.gov.in లింక్ను ఎస్బీఐ తమ కస్టమర్లతో షేర్ చేసింది. పాన్, ఆధార్ అనుసంధానికి జూన్ 30 వరకు గడువు ఇచ్చింది.
అంతకుముందు కూడా మార్చి 31వ తేదీ వరకు గడువు ఇచ్చింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దానిని పొడిగించింది. మరోవైపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) ఈ గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది.