సంవత్ 2077కు స్టాక్ మార్కెట్లు భారీగా ఎగిశాయి. దీపావళి నుండి దీపావళి వరకు చూస్తే సెన్సెక్స్ ఏకంగా 16,134 పాయింట్లు, నిఫ్టీ 5,049 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ 38 శాతం వరకు, నిఫ్టీ 41 శాతం వరకు ఎగిసింది. అమెరికా ఫెడ్ సమావేశం నేపథ్యంలో వరుసగా రెండో రోజు సూచీలు లాభపడ్డాయి. వడ్డీ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటుందనే అంచనాలతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. డాలర్ మారకంతో రూపాయి 22 పైసలు పెరిగి నెల గరిష్టం 74.46 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు నష్టపోయాయి. కరోనా కారణంగా సెన్సెక్స్ గత ఏడాది మార్చి నెలలో 26,000 దిగువకు పడిపోయింది. అయితే ఆర్థిక రికవరీ నేపథ్యంలో సూచీలు క్రమంగా పుంజుకున్నాయి. దీంతో గత ఏడాది దీపావళి నుండి ఈ ఏడాది దీపావళి వరకు సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు నలభై శాతం మేర లాభపడ్డాయి.
సంవత్ 2077లో ఈక్విటీ మార్కెట్లు గత 12 సంవత్సరాలలోనే భారీ లాభాలను నమోదు చేశాయి. ఈ కాలంలో ఎస్ అండ్ పీ బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీలు 83 శాతం లాభపడ్డాయి. ఎస్ అండ్ పీ బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 63 శాతం ఎగిసింది. సంవత్ 2065లో సూచీలు ఏకంగా 104 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంకు 40 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 71 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీ 82 శాతం లాభపడ్డాయి. కరోనా నుండి వేగంగా కోలుకొని, ఆర్థిక రికవరీ కనిపించింది. దీంతో మార్కెట్లు కూడా లాభపడ్డాయి.

దీపావళి సందర్భంగా స్టాక్ ఎక్స్ఛేంజీలు నేడు గంటపాటు ప్రత్యేక మూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తాయి. సాయంత్రం 6.15 గంటలకు మొదలై 7.15 గంటలకు ట్రేడింగ్ ముగుస్తుంది. దీపావళి బలిప్రతిపద సందర్భంగా శుక్రవారం మార్కెట్లకు సెలవు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications