సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. సామాన్యుడి జేబుపై నేరుగా ప్రభావం.. పూర్తి చేయాల్సిన పనులివే..

నూతన మాసం సెప్టెంబర్ 2026 ప్రారంభం కానున్న నేపథ్యంలో.. సామాన్య ప్రజల రోజువారీ జీవితం, ఆర్థిక కార్యకలాపాలపై నేరుగా ప్రభావం చూపే పలు ముఖ్యమైన మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు గడువు ముగియడం నుంచి ఎల్పీజీ ఇ-కేవైసీ, ఇంధన ధరల సవరణ, బ్యాంకింగ్ నిబంధనల వరకు సెప్టెంబర్ 1వ తేదీ నుండి రాబోతున్న కీలక మార్పుల సమగ్ర సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

పన్ను చెల్లింపుదారులకు ఆగస్టు 31 అత్యంత కీలకమైన రోజుగా మారింది. పన్ను ఆడిట్ పరిధిలోకి రాని వ్యాపార యజమానులు, వృత్తి నిపుణులు తమ ఐటీఆర్-3 (ITR-3), ఐటీఆర్-4 (ITR-4) ఫారమ్‌లను దాఖలు చేయడానికి ఆగస్టు 31 ఆఖరి తేదీగా నిర్ణయించారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఉచిత లేదా సాధారణ వ్యవధిలో రిటర్న్లు సమర్పించే అవకాశం ముగియనుంది.

new rules September 1 2026 September 1 rule changes India new financial rules 2026 rules affecting common man LPG e-KYC deadline ITR deadline August 31 2026 LPG price September 2026 ATF price September 2026 banking rule changes international travel rules India September rule changes financial changes India 1 2026 1 2026 LPG e-KYC ITR 31 2026 LPG

మరోవైపు, ఎల్‌పిజి గ్యాస్ వినియోగదారులు తమ ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఇ-కేవైసీ (e-KYC) పూర్తి చేయడానికి కూడా ఆగస్టు 31 ఆఖరి గడువుగా ఉంది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు గ్యాస్ సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ ప్రక్రియను చేపడుతున్నాయి. సెప్టెంబర్ 1 నుండి ఇ-కేవైసీ పూర్తి చేయని వారికి గ్యాస్ కనెక్షన్ సేవల్లో అంతరాయం ఏర్పడటం లేదా సబ్సిడీ నిలిచిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

Also Read

ప్రతి నెల మొదటి తేదీ మాదిరిగానే చమురు విక్రయ సంస్థలు అంతర్జాతీయ చమురు సూచీలు, రూపాయి విలువ ఆధారంగా ఎల్పీజీ సిలిండర్ల ధరలను పునఃసమీక్షించనున్నాయి. సెప్టెంబర్ 1న గృహ వినియోగ మరియు వాణిజ్య (Commercial) ఎల్పీజీ సిలిండర్ల నూతన ధరలు అమల్లోకి రానున్నాయి. దీనితో పాటు విమాన ఇంధనం (ATF) ధరలను కూడా సవరించనున్నారు. ఏటీఎఫ్ ధరలు పెరిగితే విమానయాన సంస్థల నిర్వహణ వ్యయం పెరిగి, ప్రయాణికుల విమాన ఛార్జీలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.

బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లకు (FD) సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించిన కొత్త మార్గదర్శకాలు సెప్టెంబర్ 1న కాకుండా అక్టోబర్ 1, 2026 నుండి అమల్లోకి వస్తాయి. ఈ నిబంధనల ప్రకారం, బ్యాంకులు ప్రతి పనిదినం తమ వెబ్‌సైట్లలో రూ. 3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విలువైన బల్క్ డిపాజిట్లపై వర్తించే వడ్డీ రేట్లను కచ్చితంగా అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక నిర్దిష్ట మొత్తం డిపాజిట్లపై ఒక బ్యాంకుకు చెందిన అన్ని శాఖల్లోనూ ఒకే విధమైన వడ్డీ రేటు వర్తిస్తుంది. అయితే వేర్వేరు మొత్తాల బల్క్ డిపాజిట్లపై భిన్నమైన వడ్డీ రేట్లను నిర్ణయించే స్వేచ్ఛ బ్యాంకులకు ఉంటుంది.

సామాన్య ప్రజలు తమ ఆర్థిక లావాదేవీలను సురక్షితంగా నిర్వహించుకోవడానికి ఈ మార్పులపై అవగాహన కలిగి ఉండటం ఎంతైనా అవసరం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+