అధిక వేతనం ఉన్న చాలామంది మధ్యతరగతి కుటుంబ సభ్యులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ప్రావిడెంట్ ఫండ్ (PF) కాంట్రిబ్యూషన్కు సంబంధించి 'డబుల్' బొనాంజా ప్రకటించింది. పీఎఫ్లో వడ్డీ పైన పన్ను మినహాయింపు పొందడానికి పరిమితిని కొన్ని నిర్దిష్ట కేసుల విషయంలో గరిష్టంగా రూ.5 లక్షలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక బిల్లుపై మగళవారం లోకసభలో జరిగిన చర్చకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ పీఎఫ్ పరిమితి అంశాన్ని ప్రస్తావించారు.

పీఎఫ్ వడ్డీపై పన్ను
పీఎఫ్ ఖాతాలో ఉద్యోగులు, యాజమాన్య వాటా కలుపుకొని ఏడాదిలో రూ.2.50 లక్షలకు మించి జమ అయినట్లయితే దానిపై లభించే వడ్డీకి పన్ను పడుతుందని నిర్మలా సీతారామన్ ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఇది ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలులోకి రానుంది. ఈ అంశానికి సంబంధించి మంగళవారం లోకసభలో ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భగా నిర్మలమ్మ మాట్లాడారు. పీఎప్ పరిమితి గురించి ప్రస్తావించారు.

వారికి పరిగణలోకి తీసుకోం
చట్ట ప్రకారం ఉద్యోగి మూలవేతనంపై 12 శాతం వరకు యాజమాన్యం తన వాటాగా పీఎఫ్లో జమ చేస్తుందని, యాజమాన్యాలు ఒకవేళ ఇంతకు మించి మొత్తాన్ని పీఎఫ్ ఖాతాలో జమ చేస్తే అప్పుడు తాజా పరిమితిగా ప్రకటించిన రూ.5 లక్షలకు ఆ మొత్తాన్ని పరిగణనలో తీసుకోమని స్పష్టం చేశారు. చందాదారుని పీఎఫ్ ఖాతాకు యాజమాన్యాలు తమ వాటా కంటే అదనంగా జమ చేయనప్పుడే ఏటా రూ.5 లక్షల మొత్తం వరకు పీఎఫ్ జమలపై వడ్డీకి పన్ను మినహాయింపు కొనసాగిస్తామని తెలిపారు.

ఎవరికి ప్రయోజనం
రూ.2.50 లక్షల కంటే తక్కువ పీఎఫ్ను ప్రతి సంవత్సరం జమ చేసేవారు 92 శాతం నుండి 93 శాతం వరకు ఉంటారని, వారికి పన్నురహిత వడ్డీ లభిస్తుందన్నారు. ఈపీఎఫ్ పన్ను పరిమితి పెంపు నిర్ణయం బేసిక్ యాన్యువల్ శాలరీ రూ.41.66 లక్షలు ఉన్నవారికి లేదా మొత్తం శాలరీ అమౌంట్ రూ.83 లక్షలు ఉన్నవారికి ప్రయోజనం.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications