ఈక్విటీల్లో ఇన్వెస్ట్: 2021 డిసెంబర్ నాటికి సెన్సెక్స్@50,000, 9 నెలల్లో 60 శాతం జంప్

ముంబై: కరోనా దెబ్బ నుండి ప్రపంచ, ఆసియా, దేశీయ మార్కెట్లు క్రమంగా కోలుకుంటున్నాయి. గత కొద్ది సెషన్లులోనే సరికొత్త రికార్డులను తాకాయి. కరోనా నేపథ్యంలో 2020 మార్చి 23వ తేదీన పాతాళాన్ని తాకిన సెన్సెక్స్, నిఫ్టీ లాక్ డౌన్ సమయంలో దాదాపు అక్కడే కదలాడాయి. అన్-లాక్ నేపథ్యంలో మే నెల నుండి క్రమంగా కోలుకుంటున్నాయి. 26వేల స్థాయికి పడిపోయిన సెన్సెక్స్ ఇప్పుడు ఏకంగా 44వేల మార్కును తాకింది. అంటే 9 నెలల కాలంలో సెన్సెక్స్ 18వేల పాయింట్లు ఎగిసింది. గత రెండు నెలలుగా భారీగా ఎగిసినప్పటికీ, సగటున నెలకు 2వేల పాయింట్లు లాభపడింది.

50,000 మార్కుకు సెన్సెక్స్

50,000 మార్కుకు సెన్సెక్స్

భారత ఆర్థిక రికవరీ వేగవంతంగా కనిపిస్తోన్న సూచనలు కనిపిస్తోంది. జీఎస్టీ కలెక్షన్ల నుండి దాదాపు ప్రతి అంశంలో కార్యకలాపాలు పుంజుకున్నాయి. కొన్ని రంగాల్లో కరోనా ముందుస్థాయిని దాటాయి. దీనికి తోడు వ్యాక్సీన్‌పై సానుకూల ప్రకటనలు వస్తున్నాయి. దీంతో పది సెషన్లలోనే 43వేల మార్కును దాటిన సెన్సెక్స్, తాజాగా 44వేలను క్రాస్ చేసింది. 2021 డిసెంబర్ నాటికి సెన్సెక్స్ 50,000 మార్కుకు చేరుకోవచ్చునని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. అంతకుముందు జూన్ 2021 నాటికి సెన్సెక్స్ 37,300కు చేరుకోవచ్చనని అంచనా వేసింది. ఇప్పుడు దానిని సవరించి వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి హాఫ్ సెంచరీ దాటవచ్చునని పేర్కొంది.

మరిన్ని రికార్డుల దిశగా... సర్దుబాటు కొట్టిపారేయలేం

మరిన్ని రికార్డుల దిశగా... సర్దుబాటు కొట్టిపారేయలేం

ఈ గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ (మోర్గాన్ స్టాన్లీ) బీఎస్ఈ సెన్సెక్స్ FY21, FY22, FY23 ఆర్థిక సంవత్సరాలలో ఆదాయ అంచనాలను కూడా వరుసగా 15 శాతం, 10 శాతం, 9 శాతానికి పెంచింది. ఈ కాలంలో సూచీ భారీ లాభాలను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల మార్కెట్లు కొత్త శిఖరాలను తాకుతుండటంతో తిరిగి పడిపోయే అవకాశాలు లేకపోలేదని కూడా పలువురు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సీన్ సానుకూల ప్రకటనల నేపథ్యంలో మార్కెట్లు అనూహ్యంగా పుంజుకున్నాయని, కాస్త సర్దుబాటుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

60 శాతం జంప్ చేసిన సూచీలు

60 శాతం జంప్ చేసిన సూచీలు

కరోనా వైరస్ దేశంలో పెరిగితే సెన్సెక్స్ 37,000 స్థాయికి పడిపోవచ్చునని కూడా మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. సెన్సెక్స్ టార్గెట్ 59,000గా పేర్కొంది. 2021లో స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్ సూచీలు రాణించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. గతవారం గోల్డ్‌మన్ శాక్స్ నిఫ్టీ టార్గెట్‌ను 2021 చివరి నాటికి 14,100కు అప్ గ్రేడ్ చేసింది. నోమురా కూడా డిసెంబర్ 2021 నాటికి 13,640 పాయింట్లుగా అంచనా వేసింది. మార్చి కనిష్ట స్థాయి నుండి భారత సూచీలు 60 శాతానికి పైగా లాభపడ్డాయి. ఇక నవంబర్ నెలలో ఫారెన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (FII)లు 4.15 బిలియన్ డాలర్లు వచ్చాయి. గతమూడు నెలల కాలంలో ఇది గరిష్టం.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+