స్టాక్ మార్కెట్ వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోడు ముడిచమురు ధరలు, ద్రవ్యోల్భణ భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. దీంతో వరుసగా మూడో రోజు మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ఆరంభంలో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 18,000 పాయింట్లకు దిగువనే ఉంది. సెన్సెక్స్ 60,000 పాయింట్ల కిందకు పడిపోయింది. ఉదయం గం.11.15 సమయానికి సెన్సెక్స్ 500 పాయింట్లు క్షీణించి 59,595 పాయింట్ల వద్ద, నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయి 17,805 పాయింట్లవద్ద ట్రేడ్ అయింది.

మూడ్రోజుల్లో లక్షల కోట్లు
మార్కెట్లు వరుసగా మూడు రోజులుగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ మిశ్రమ సంకేతాలు, ముడి చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ ఆందోళనలు, ఒమిక్రాన్ భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. సెన్సెక్స్ మూడు రోజుల్లోనే 1500 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇన్వెస్టర్లు ఈ మూడు రోజుల్లో లక్షల కోట్లు నష్టపోయారు.

భారీగా నష్టపోయిన పేటీఎం
పేటీఎం స్టాక్ స్టాక్ నేడు స్వల్పంగా లాభపడింది. నేడు మధ్యాహ్నం గం.11.30 సమయానికి పేటీఎం రూ.6.70 పైసలు లేదా 0.67 శాతం లాభపడి రూ.1004.10 వద్ద ట్రేడ్ అయింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 65వేల కోట్లుగా ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్టం రూ.1955, కనిష్టం రూ.990. ఇది కూడా నిన్ననే నమోదయింది.

26 శాతం నష్టం
పేటీఎం స్టాక్స్ గత మూడు వారాల్లోనే 26 శాతం మేర క్షీణించాయి. నిన్న ఈ స్టాక్ రూ.990కు కూడా పడిపోయింది. చివరకు రూ.1000కు దిగువనే రూ.997.35 వద్ద ముగిసింది. నిన్న మొదటిసారి నాలుగు అంకెల నుండి మూడంకెల స్థాయికి పడిపోయింది. నిన్నటి వరకు ఈ స్టాక్ గత 12 సెషన్లలో 11సార్లు నష్టాల్లో ముగిసింది. మొత్తంగా ఇరవై ఆరు శాతం పడిపోయింది. ఐపీవో ధరతో పోలిస్తే 54 శాతం క్షీణించింది. అయితే ఈ స్టాక్ వచ్చే పన్నెండు నెలల కాలంలో రూ.1875కు చేరుకుంటుందని మార్కెట్ నిపుణుల అంచనా. అప్పటికి కూడా ఇష్యూ ధరకు చేరుకోనట్లే.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

ఇరాన్ యుద్దం భారత్కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

స్టాక్ మార్కెట్లో బ్లాక్ మండే.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న అన్ని రంగాలు.. ఇన్వెస్టర్లు విలవిల..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications