ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన కస్టమర్లకు KYC ఫ్రాడ్ గురించి హెచ్చరికలను జారీ చేసింది. KYC పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మీకు KYC ఏమైనా కాల్స్ లేదా సందేశాలు వస్తే వాటి గురించి సైబర్ క్రైమ్కు తెలియజేయాలని కోరింది. ఈ మేరకు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టింది. SBI KYC పేరుతో జరుగుతున్న మోసం దేశవ్యాప్తంగా వేగంగా వ్యాప్తిస్తోందని, అలాంటి మోసగాళ్లు ఎస్బీఐ ప్రతినిధి పేరుతో పంపిన ఎలాంటి లింక్స్ పైన క్లిక్ చేయవద్దని కోరింది.

KYC అప్ డేట్ మోసం
KYC ఫ్రాడ్స్టర్స్ వివిధ లింక్స్ పంపించడం, KYCని అప్ డేట్ చేయమని అడగడం చేస్తారని, తద్వారా మిమ్మల్ని మోసం చేస్తారని ఎస్బీఐ పేర్కొంది. ఇలాంటి అపరిచిత సందేశాలు మీకు వస్తే వెంటనే సైబర్ క్రైమ్కు నివేదించాలని సూచించింది. ఈ మేరకు సైబర్ క్రైమ్ వెబ్ సైట్ http://cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలని తెలిపింది.
ఈ కరోనా కాలంలో ఇలాంటి మోసాలు పెరుగుతున్నాయని సైబర్ నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ముఖ్యమైన సమాచారాన్ని ఎవరితో షేర్ చేయవద్దని ఎస్బీఐ తెలిపింది. అలాగే ఎస్బీఐ పేరుతో ఇతర మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కస్టమర్లను కోరింది.

కొన్ని టిప్స్
- అపరిచిత వ్యక్తుల నుండి ఎస్సెమ్మెస్, ఈ మెయిల్స్ రూపంలో వచ్చే లింక్స్ పైన క్లిక్ చేయవద్దు.
- టెలిఫోన్ కాల్స్, ఈ-మెయిల్ సోర్స్ ద్వారా వచ్చే ఎలాంటి మొబైల్ యాప్స్ను డౌన్ లోడ్ చేయవద్దు.
- ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, డెబిట్ కార్డు నెంబర్, పిన్, CVV, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్ వర్డ్, ఓటీపీ వంటి వాటిని షేర్ చేయవద్దు.

ఫ్రాడ్స్
ఎస్బీఐ ఎప్పుడు కూడా కేవైసీ అప్ డేట్ కోసం లింక్స్ను పంపించదని స్పష్టం చేసింది. ఫేక్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కాగా, కరోనా సమయంలో బ్యాంకింగ్ ఫ్రాడ్స్ కూడా పెరిగిన విషయం తెలిసిందే. డిజిటలైజేషన్ పెరిగే కొద్దీ ఫ్రాడ్స్ కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications