Monthly Pension: ప్రస్తుత కాలంలో చాలా మంది ఆర్థిక అంశాలపై అవగాహన పెంచుకుంటున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ తక్కువ మెుత్తం పెట్టుబడులతో మంచి రిటర్న్స్ పొందుతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది కేంద్ర ప్రభుత్వ పథకం అటల్ పెన్షన్ యోజన గురించే. దీని ద్వారా ప్రతినెల రూ.5,000 కచ్చితమైన ఆదాయాన్ని ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం మీరు రోజుకు ఒక కప్పు టీ కంటే తక్కువ మెుత్తాన్ని పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ముందుగా మీరు 18 ఏళ్ల వయస్సులోనే ప్లానింగ్ చేస్తున్నట్లయితే దీనిని కేవలం రోజుకు రూ.7 అంటే నెలకు రూ.210 వెచ్చిస్తే సరిపోతుంది. 60 ఏళ్ల వయస్సులో రిటైర్మెంట్ తర్వాత దీని ఫలితాలను పెట్టుబడిదారు అందుకుంటారు.

అదే మీరు కొంత ఆలస్యంగా 25వ ఏట అటల్ పెన్షన్ యోజనను ప్రారంభించినట్లయితే కొంత ఎక్కువగా నెలకు రూ.367 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అలాగే 30వ ఏటా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నట్లయితే నెలకు రూ.577 చెల్లించాలి. ఇక చివరిగా ఎవరైనా వ్యక్తి తన 35వ ఏట దీనిని ప్రారంభించాలనుకుంటే అందుకోసం నెలకు రూ.902 పెట్టుబడిగా పెట్టాలన్నమాట. దీంతో రిటైర్మెంట్ తర్వాత వచ్చే ఇతర ఆదాయ మార్గాలకు తోడుగా ప్రతినెల రూ.5,000 పెన్షన్ రూపంలో పొందగలుగుతారు.
ఇలా 18 నుంచి 40 ఏళ్ల మధ్య వ్యక్తులు తమ ఆదాయాలకు అనుగుణంగా తమ నెలవారీ పెన్షన్ ప్లానింగ్ చిన్న వయస్సులోనే ప్రారంభించటం ద్వారా అత్యంత తక్కువ ఖర్చుతోనే తమ గోల్స్ చేరుకోవచ్చు. ఈ పథకాన్ని మోదీ ప్రభుత్వం 2015-16లో ప్రారంభించింది. ఇది కార్మికులు, ఆర్థికంగా బలహీన వ్యక్తుల కోసం రూపొందించిన నెలవారీ పెన్షన్ పథకం. వెంటనే దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుని సద్వినియోగం చేసుకోండి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications