ఈ 3 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే సాలిడ్ రిటర్న్స్ పొందవచ్చు!
వడ్డీ రేట్ల పెంపుకు సమయం ఉందని ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పోవెల్ సంకేతాలు ఇవ్వడంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లు పుంజకుంటున్నాయి. చివరి సెషన్లో ఎస్ అండ్ పీ 500 స్వల్పంగా ఎగిసింది. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ మంచి రిటర్న్స్ ఇచ్చే కొన్ని స్టాక్స్ను సూచిస్తోంది.
ఈ బ్రోకరేజ్ సంస్థ ప్రకారం కింద పేర్కొనే స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ స్టాక్స్ ఎందుకు వృద్ధి నమోదు చేస్తాయో తెలుసుకుందాం. అయితే స్టాక్స్లో పెట్టుబడి రిస్క్తో కూడిన అంశం. బ్రోకరేజీ సంస్థలు, వ్యాసం ఆధారంగా పెట్టుబడుల కంటే నిపుణుల సలహాలతో పెట్టుబడులు మంచిది.
సనోఫీ ఇండియా
సనోఫీ ఇండియా డయాబెటిస్కు మెడికేషన్ (ఇన్సులిన్స్, ఓరల్స్) తయారీ చేస్తుంది. వీటితో పాటు కార్డియాలజీ, థ్రోబోసిస్, యాంటీ-ఇన్ఫెక్టివ్, సీఎన్ఎస్, అలర్జీ, విటమిన్స్, మినరల్స్, సప్లిమెంట్స్ తదితరాల చికిత్సకు మందును తయారు చేస్తుంది. లాంటస్, అలెగ్రా, కాంబీఫ్లామ్ వంటి టాప్ 100 ఫార్మాస్యూటికల్ బ్రాండ్స్ ఉన్నాయి. సనోఫీ ఇండియా దేశంలో వేగంగా వృద్ధి నమోదు చేస్తోన్న యాంటీ-డయాబెటిక్ డ్రగ్ కంపెనీ.
2021 క్యాలెండర్ ఏడాది రెండో త్రైమాసికంలో సనోఫీ ఇండియా బలమైన లాభాలు ఆర్జించింది. సేల్స్ 11.1 శాతం పెరిగి రూ.789.1 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం ఈ స్టాక్ రూ.8,090 వద్ద ఉంది. టార్గెట్ ధరను రూ.19,235గా ఉంది.
TTK ప్రెస్టీజ్
టీటీకే ప్రెస్టీజ్ టాప్ కిచెన్ సొల్యూషన్స్ ప్రొవైడర్. ఇది ప్రెజర్ కుక్కర్ తయారీదారు నుండి ఇంటి, కిచెన్ ఉపకరణాల స్థాయికి వచ్చింది. Q1FY22 లో రెవెన్యూ 36 శాతం తగ్గి రూ.356.9 కోట్లుగా నమోదయింది. ఏడాది ప్రాతిపదికన 71 శాతం తగ్గింది. టీటీకే ప్రెస్టీజ్ టార్గెట్ ధర రూ.8,801 కోట్లుగా పేర్కొంది. టార్గెట్ ధర రూ.10,675గా పేర్కొంది.
డిక్సాన్ టెక్నాలజీస్
గత మూడేళ్ల కాలంలో డిక్సాన్ టెక్నాలజీస్ షేర్ ధర ఎనిమిది రెట్లు పెరిగింది. 2018 జూలై నెలలో రూ.566గా ఉన్న షేర్ ఇప్పుడు రూ.4380గా ఉంది. డిక్సాన్ షేర్ ధర ప్రస్తుతం రూ.4242 వద్ద ఉంది. ఈ స్టాక్ టార్గెట్ ధరను రూ.5050గా పేర్కొంది.