కోటి రూపాయలు సంపాదించాలని చాలామందికి కోరిక ఉంటుంది. అయితే ఇప్పుడున్న రోజుల్లో అది పెద్ద కష్టమేమీ కాదు. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే తక్కువ కాలంలోనే కోటి రూపాయల కలను నిజం చేసుకోవచ్చు. దీన్ని సాకారం చేసేందుకు కొన్ని స్కీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఓపిక, ఆర్థిక క్రమశిక్షణ ఉంటే చాలు ఈజీగా రూ. కోటి సంపాదించొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
బెస్ట్ స్కీమ్ ఇదే..
కోటి రూపాయలు పోగు చేయడానికి నేషనల్ పెన్షన్ స్కీమ్ బెస్ట్ ఆప్షన్. ఈ స్కీమ్ ద్వారా మీరు 20 నుంచి 30 ఏళ్లలో కోటి రూపాయలు సంపాదించొచ్చు. మీరు ముప్ఫై ఏళ్ల నుంచి డబ్బు మదుపు చేయడం మొదలుపెడితే యాభై ఏళ్ల వయసు వచ్చే సరికి రూ. కోటి ఫండ్ మీ దగ్గర ఉంటుంది. పెన్షన్ అనేది భవిష్యత్తులో ఆర్థిక భద్రతకు భరోసానిస్తుంది. అందుకే చాలామంది ఇప్పుడు ఎన్పీఎస్ పథకం గురించి తెలుసుకుంటున్నారు. ఇది ప్రభుత్వ మద్దతుతో నడిచే సేవింగ్స్ ప్లాన్. ఇందులో ఎలాంటి రిస్క్ ఉండదు.

కాలిక్యులేషన్ ఇలా..
నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది మ్యూచువల్ ఫండ్ మాదిరిగా పనిచేస్తుంది. అయితే ఇది ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంది. ఇందులో కూడా ఈక్విటీ, బాండ్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. దీనికి కూడా ఫండ్ మేనేజర్స్ ఉంటారు. ఈ స్కీమ్ లో ఈక్విటీ, కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ లో ఎంతెంత పెట్టుబడి పెడుతున్నారు అన్న దాన్ని బట్టి ఆదాయం మారుతుంటుంది. ఓవరాల్ గా ఈ స్కీమ్ లో 8 నుంచి 9 శాతం యాన్యువల్ రిటర్న్స్ ను ఆశించొచ్చు. ఈ లెక్కన యంగ్ ఏజ్ లోనే ఈ స్కీమ్ లో పెట్టుబడి మొదలుపెడితే రిటైర్మెంట్ నాటికి రూ. కోటి సంపాదించొచ్చు. ఉదాహరణకు 35 ఏళ్ల వ్యక్తి నెలకు రూ.10 వేలు పెట్టుబడి పెడుతూపోతే 9 శాతం రిటర్న్స్ కింద రిటైర్మెంట్ నాటికి రూ.1.04 కోట్లు సంపాదించొచ్చు. ఇంకా ఇందులో వయసు వారీగా ప్రణాళికలు చేయొచ్చు. అదెలాగంటే..
ఫార్ములా ఇదే..
ఒక వ్యక్తి నేషనల్ పెన్షన్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటే రూ. 10 వేలను ఇలా డివైడ్ చేసుకుంటే మంచిది.
- 25-35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్లు 75% ఈక్విటీ, 15% కార్పొరేట్ బాండ్లు, 5% ప్రభుత్వ బాండ్లు, 5% ఇతర ప్రత్యామ్నాయాల్లో పెట్టుబడి పెట్టాలి.
- 36-45 సంవత్సరాల వాళ్లు 60% ఈక్విటీ, 25% కార్పొరేట్ బాండ్లు, 10% ప్రభుత్వ బాండ్లు, 5% ప్రత్యామ్నాయాలను ఎంచుకోవచ్చు.
- 46-55 సంవత్సరాల వయసున్న వాళ్లు 40% ఈక్విటీ, 35% కార్పొరేట్ బాండ్లు, 20% ప్రభుత్వ బాండ్లు, 5% ప్రత్యామ్నాయాలను ఎంచుకోవచ్చు.
- 56-60 సంవత్సరాలు వయసున్న వాళ్లు 25% ఈక్విటీ, 40% కార్పొరేట్ బాండ్లు, 30% ప్రభుత్వ బాండ్లు, 5% ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి.
ఈ పై ఫార్ములా ద్వారా పెట్టుబడి పెడుతూ పోతే సగటున 9 నుంచి 10 శాతం రిటర్న్స్ గనుక వస్తే.. రిటైర్మెంట్ నాటికి రూ. కోటి ఫండ్ సమకూరుతుంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications