రూ. 3 లక్షలు కోట్లు దాటిన గోల్డ్-సిల్వర్ ఇటిఎఫ్‌ ఆస్తులు.. కేవలం 5 నెలల్లోనే మూడు రెట్లు పెరుగుదల..

భారతదేశంలో బంగారం, వెండి ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు)పై పెట్టుబడిదారుల ఆసక్తి ఇటీవలి నెలల్లో భారీగా పెరిగింది. 2026 జనవరి నాటికి ఈ రెండు ETFలలో నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల విలువ (AUM) రూ.3 లక్షల కోట్లను దాటింది. ఇది గత ఐదు నెలల్లోనే మూడు రెట్లు పెరగడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. 2025 ఆగస్టులో ఈ సంఖ్య కేవలం రూ.1 లక్ష కోట్లు మాత్రమే ఉండడం విశేషం.

అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) విడుదల చేసిన డేటా ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ పెట్టుబడిదారులు ఈ ETFలపై నమ్మకం ఉంచుతున్నారు. మార్కెట్‌లోని అనిశ్చిత పరిస్థితుల మధ్య సురక్షిత పెట్టుబడి మార్గంగా వీటిని భావిస్తూ భారీగా డబ్బు పెట్టుబడి పెడుతున్నారు. ETFలపై పెరిగిన ఆసక్తి ఖాతాల సంఖ్యలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. 2025 ఆగస్టులో 80.34 లక్షలుగా ఉన్న గోల్డ్ ETF ఖాతాలు, 2026 జనవరి నాటికి 1.14 కోట్లకు చేరాయి. అంటే దాదాపు 43 శాతం వృద్ధి నమోదైంది.

Gold ETF assets Silver ETF assets Gold Silver ETFs India ETF assets under management AUM crosses Rs 3 lakh crore Gold ETF inflows Silver ETF inflows precious metals ETFs safe haven investments gold investment India silver investment India ETF market India investor shift to safe assets market volatility impact inflation hedge investments gold silver prices ETF investment trends 2025 mutual fund alternatives Indian ETF market commodity ETFs India ETF ETF ETF ETF 3 ETF ETF ETF ETF ETF ETF 2025 ETF ETF

ఇక సిల్వర్ ETFల విషయానికి వస్తే.. వృద్ధి మరింత అద్భుతంగా ఉంది. ఆగస్టు 2025లో కేవలం 11.31 లక్షలుగా ఉన్న సిల్వర్ ETF ఖాతాలు, జనవరి 2026 నాటికి 47.85 లక్షలకు పెరిగాయి. ఇది సుమారు 323 శాతం పెరుగుదలగా నిపుణులు పేర్కొంటున్నారు.

2026 జనవరిలో మాత్రమే గోల్డ్ ETFలలోకి రూ.24,039 కోట్లకు పైగా కొత్త పెట్టుబడులు వచ్చాయి. అదే సమయంలో సిల్వర్ ETFలలో రూ.9,463 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. మొత్తంగా చూస్తే.. ఒక్క నెలలోనే బంగారం-వెండి ETFలలోకి దాదాపు రూ.33,500 కోట్ల డబ్బు ప్రవేశించింది. ఇది అదే నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కు వచ్చిన పెట్టుబడులు (రూ.24,029 కోట్లు) కంటే ఎక్కువ కావడం విశేషం.

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ బలహీనత, అలాగే భారతదేశం-అమెరికా వాణిజ్య సంబంధాలపై ఉన్న అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో బంగారం ఎప్పటినుంచో విశ్వసనీయ పెట్టుబడిగా భావించబడుతోంది. అదే విధంగా.. వెండి ధరలు గత ఏడాది గణనీయంగా పెరగడం, అలాగే ఎలక్ట్రానిక్స్, సౌరశక్తి వంటి పారిశ్రామిక రంగాల్లో వెండి వినియోగం పెరగడం వల్ల వెండి ETFలపై కూడా నమ్మకం పెరిగింది.

నిపుణుల మాటల్లో చెప్పాలంటే.. ఈ ట్రెండ్ ఈక్విటీ మార్కెట్ పతనానికి సంకేతం కాదని వారు అంటున్నారు. మార్కెట్‌లోని అస్థిరత నుంచి రక్షణ పొందేందుకు పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలో బంగారం, వెండిని చేర్చుకుంటున్నారు. దీర్ఘకాలికంగా చూస్తే మొత్తం పెట్టుబడిలో 10-15 శాతం వరకు బంగారం లేదా వెండికి కేటాయించడం సమంజసమని సూచిస్తున్నారు. అయితే, ఒకే ఆస్తిలో ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా.. వైవిధ్యాన్ని పాటించడమే ఉత్తమ మార్గమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగారం, వెండి పోర్ట్‌ఫోలియోను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి గానీ, ప్రధాన రాబడిని అందించే సాధనాలుగా మాత్రం వీటిని చూడకూడదని వారు స్పష్టం చేస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+