భారతదేశంలో బంగారం, వెండి ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు)పై పెట్టుబడిదారుల ఆసక్తి ఇటీవలి నెలల్లో భారీగా పెరిగింది. 2026 జనవరి నాటికి ఈ రెండు ETFలలో నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల విలువ (AUM) రూ.3 లక్షల కోట్లను దాటింది. ఇది గత ఐదు నెలల్లోనే మూడు రెట్లు పెరగడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. 2025 ఆగస్టులో ఈ సంఖ్య కేవలం రూ.1 లక్ష కోట్లు మాత్రమే ఉండడం విశేషం.
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) విడుదల చేసిన డేటా ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ పెట్టుబడిదారులు ఈ ETFలపై నమ్మకం ఉంచుతున్నారు. మార్కెట్లోని అనిశ్చిత పరిస్థితుల మధ్య సురక్షిత పెట్టుబడి మార్గంగా వీటిని భావిస్తూ భారీగా డబ్బు పెట్టుబడి పెడుతున్నారు. ETFలపై పెరిగిన ఆసక్తి ఖాతాల సంఖ్యలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. 2025 ఆగస్టులో 80.34 లక్షలుగా ఉన్న గోల్డ్ ETF ఖాతాలు, 2026 జనవరి నాటికి 1.14 కోట్లకు చేరాయి. అంటే దాదాపు 43 శాతం వృద్ధి నమోదైంది.

ఇక సిల్వర్ ETFల విషయానికి వస్తే.. వృద్ధి మరింత అద్భుతంగా ఉంది. ఆగస్టు 2025లో కేవలం 11.31 లక్షలుగా ఉన్న సిల్వర్ ETF ఖాతాలు, జనవరి 2026 నాటికి 47.85 లక్షలకు పెరిగాయి. ఇది సుమారు 323 శాతం పెరుగుదలగా నిపుణులు పేర్కొంటున్నారు.
2026 జనవరిలో మాత్రమే గోల్డ్ ETFలలోకి రూ.24,039 కోట్లకు పైగా కొత్త పెట్టుబడులు వచ్చాయి. అదే సమయంలో సిల్వర్ ETFలలో రూ.9,463 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. మొత్తంగా చూస్తే.. ఒక్క నెలలోనే బంగారం-వెండి ETFలలోకి దాదాపు రూ.33,500 కోట్ల డబ్బు ప్రవేశించింది. ఇది అదే నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కు వచ్చిన పెట్టుబడులు (రూ.24,029 కోట్లు) కంటే ఎక్కువ కావడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ బలహీనత, అలాగే భారతదేశం-అమెరికా వాణిజ్య సంబంధాలపై ఉన్న అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో బంగారం ఎప్పటినుంచో విశ్వసనీయ పెట్టుబడిగా భావించబడుతోంది. అదే విధంగా.. వెండి ధరలు గత ఏడాది గణనీయంగా పెరగడం, అలాగే ఎలక్ట్రానిక్స్, సౌరశక్తి వంటి పారిశ్రామిక రంగాల్లో వెండి వినియోగం పెరగడం వల్ల వెండి ETFలపై కూడా నమ్మకం పెరిగింది.
నిపుణుల మాటల్లో చెప్పాలంటే.. ఈ ట్రెండ్ ఈక్విటీ మార్కెట్ పతనానికి సంకేతం కాదని వారు అంటున్నారు. మార్కెట్లోని అస్థిరత నుంచి రక్షణ పొందేందుకు పెట్టుబడిదారులు తమ పోర్ట్ఫోలియోలో బంగారం, వెండిని చేర్చుకుంటున్నారు. దీర్ఘకాలికంగా చూస్తే మొత్తం పెట్టుబడిలో 10-15 శాతం వరకు బంగారం లేదా వెండికి కేటాయించడం సమంజసమని సూచిస్తున్నారు. అయితే, ఒకే ఆస్తిలో ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా.. వైవిధ్యాన్ని పాటించడమే ఉత్తమ మార్గమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగారం, వెండి పోర్ట్ఫోలియోను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి గానీ, ప్రధాన రాబడిని అందించే సాధనాలుగా మాత్రం వీటిని చూడకూడదని వారు స్పష్టం చేస్తున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications