భారత దిగ్గజ బ్యాంకులు ప్రస్తుతం వడ్డీరేటును పదేళ్ల కనిష్టానికి తగ్గించాయి. దీనికి తోడు హోమ్ బిల్డర్స్ ఇళ్లను, ఫ్లాట్స్ను కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో దాదాపు ఏడాదిన్నరగా రియాల్టీ దిగ్గజం కుదేలయింది. గత కొద్ది రోజులుగా కోలుకుంటోంది. ఇప్పుడు పండుగ సీజన్ ప్రారంభమైంది. దీంతో ఈ పండుగ సీజన్ను ఉపయోగించుకొని, డిమాండ్ను పెంపొందించేలా బ్యాంకులు, హోమ్ బిల్డర్స్ వడ్డీ రేట్లు తగ్గించడం, ఆఫర్లు ఇవ్వడం చేస్తున్నారు.
కరోనా నేపథ్యంలో చాలామంది ఇప్పుడు హెల్త్ ఇన్సురెన్స్, లైఫ్ ఇన్సురెన్స్తో పాటు పెట్టుబడుల దిశగా ఆలోచన చేస్తున్నారు. విచ్చలవిడి ఖర్చును పక్కన పెట్టేసి, ఏదో రూపంలో దాచుకునేందుకు ఇష్టపడుతున్నారు. అలాగే, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి వివిధ కారణాలతో సొంతిళ్లకు డిమాండ్ వచ్చింది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నందున విక్రయాలు పుంజుకుంటాయని భావిస్తున్నారు. డిమాండ్ను మరింత పెంచేలా బ్యాంకులు, హోమ్ బిల్డర్స్ ప్రత్యేక వడ్డీ రేటు తగ్గింపు, ఆఫర్లు ఇస్తున్నారు.

సురక్షిత రుణ కేటగిరీ
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పోరేషన్, కొటక్ మహీంద్రా బ్యాంకులు ప్రత్యేక వడ్డీ రేట్లను అమలు చేస్తున్నాయి. పండుగ సందర్భంగా వడ్డీ రేటును 15 బేసిస్ పాయింట్ల నుండి 60 బేసిస్ పాయింట్ల మేర తగ్గించాయి. దీంతో ప్రారంభ వడ్డీ రేటు ఏకంగా 6.5 శాతం నుండి 6.7 శాతం స్థాయికి పడిపోయింది. ఇది దశాబ్ద కాలంలో కనిష్ట వడ్డీ రేటు. కరోనా కారణంగా బ్యాంకుల బ్యాడ్ లోన్స్ పెరిగాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు సెక్యూర్డ్ రుణాల కేటగిరీని పెంచుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఆర్బీఐ పెద్ద మొత్తంలో నగదును ఇండక్ట్ చేసిన తర్వాత వడ్డీ రేట్లు తగ్గాయి.

ఆకర్షణీయ వడ్డీ రేటు, డిస్కౌంట్
ఓ వైపు పండుగ సమయంలో బ్యాంకులు వడ్డీ రేటును తగ్గించగా, మరోవైపు బిల్డర్స్ ఇళ్లు, ఫ్లాట్స్ పైన ఆకర్షణీయ డిస్కౌంట్ ఇస్తున్నారు. రియాల్టీ నుండి ఆటో రంగం వరకు వివిధ కంపెనీలు పండుగ సమయంలో ఆఫర్లు ఇస్తున్నాయి. వాల్ మార్ట్కు చెందిన ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో భాగంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై 80 శాతం డిస్కౌంట్ను అందిస్తున్నాయి. అమెజాన్ కూడా ఆఫర్లను ప్రకటించింది.
ఆటో కంపెనీలు కూడా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కరోనా కారణంగా ఇన్నాళ్లు సేల్స్ లేకపోవడంతో హోమ్ బిల్డర్స్ కూడా ప్రత్యేక డిస్కౌంట్స్ అమలు చేస్తున్నారు. 'వడ్డీ రేట్లు తగ్గడం, పండుగ సమయంలో ఇళ్ల పైన డిస్కౌంట్ వంటి అంశాలు డిమాండ్ను పెంచేవేనని' ప్రాపర్టీ రీసెర్చ్ కంపెనీ జాన్స్ లాంగ్ లాసాల్ ఇంక్ చీఫ్ ఎకనమిస్ట్ అండ్ హెడ్ శమంతక్ దాస్ అన్నారు.

ఇల్లు కొనుగోలు చేస్తామని..
వచ్చే మూడు నెలల కాలంలో ఇంటిని కొనుగోలు చేయాలని చాలామంది భావిస్తున్నారని జేఎల్ఎల్ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో పాల్గొన్న 2500 మందిలో 80 శాతం కంటే ఎక్కువమంది వచ్చే మూడు నెలల కాలంలో ఇల్లును ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో జేఎల్ఎల్ సర్వే నిర్వహించింది. పండుగ సమయంలో ఆఫర్లు 30 శాతం నుండి 35 శాతం డిమాండ్ పెరగడానికి దోహదపడుతుందని వెల్లడించింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications