బంపరాఫర్, వ్యాక్సీన్ వేయించుకుంటే FDపై అధిక వడ్డీ రేటు
వ్యాక్సీన్ వేయించుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ల పైన అదనపు వడ్డీ రేటును పొందవచ్చు. వివిధ ప్రభుత్వ, ప్రయివేటురంగ బ్యాంకులు ఈ ఆఫర్ అందిస్తున్నాయి. సాధారణ కస్టమర్లకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటును అదనంగా ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లు అయితే మరో 25 బేసిస్ పాయింట్లు ఉంది.
ప్రస్తుత కరోనా మహమ్మారి పరిస్థితుల్లోవ్యాక్సినేషన్ను ప్రోత్సహించేందుకు సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా సామాజిక బాధ్యతలో భాగంగా దీనిని తీసుకు వస్తున్నట్లు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. ఆరోగ్యకరమైన సొసైటీని నిర్మించే ఉద్దేశ్యంలో భాగంగా 1111 రోజులకు గాను ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ స్కీంను అదనంగా 25 శాతం వడ్డీ రేటుకు అందిస్తున్నట్లు తెలిపింది.
పౌరులను వ్యాక్సినేషన్ దిశగా ప్రోత్సహించేందుకు ఈ ఆఫర్ ప్రవేశ పెట్టినట్లు తెలిపింది. కరోనా నేపథ్యంలో పౌరులు వ్యాక్సీన్ వేసుకోవాలని బ్యాంకులు కోరుతున్నాయి. అదే సమయంలో FD పైన ఆకర్షణీయ వడ్డీ రేటును పొందవచ్చునని తెలిపింది.