Savings Scheme: ఆ ప్రభుత్వ స్కీములో డబ్బు పెట్టారా? అయితే అక్టోబర్ 1 నుంచి సున్నా వడ్డీ వస్తుంది..!!
National Savings Scheme: దేశీయంగా చాలా మంది సామాన్య ప్రజలు పెట్టుబడులకు అనేక ఆధునిక సాధనాలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం అందించే చిన్న పొదుపు పథకాలపై తమ మక్కువను మాత్రం మానుకోవటం లేదు. మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఈక్విటీల వరకు అధిక రిస్క్ తోపాటు ఆదాయాన్ని అందిస్తున్న చాలా వాటి కంటే భద్రత కలిగిన పథకాల్లో తమ డబ్బును సంరక్షించుకోవాలని చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక విషయం ఉంది.
నేషనల్ సేవింగ్స్ స్కీమ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 30లోగా డిపాజిటర్లు తమ నిధులను ఉపసంహరించుకోవాలని ఆదేశంలో సూచించింది. వడ్డీ చెల్లింపులు అక్టోబర్ 1, 2024 నుంచి నిలిపివేయబడతాయని కూడా అందులో స్పష్టం చేసింది. పెట్టుబడిదారులు తమ ఆర్థిక భవిష్యత్తు, భవిష్యత్తు తరాలకు భద్రత కల్పించాలనే ఉద్దేశ్యంతో 37 ఏళ్ల క్రితం నేషనల్ సేవింగ్స్ స్కీమ్(NSS)లో పెట్టుబడి పెట్టిన డిపాజిటర్లు సెప్టెంబర్ 30, 2024లోగా తమ నిధులన్నింటినీ ఉపసంహరించుకోవాలని తెల్చి చెప్పింది.

నేషనల్ సేవింగ్స్ స్కీమ్ పెట్టుబడిదారులు తమ KYC సమాచారాన్ని అప్డేట్ చేయాలని కోరింది. 2002లో NSS నిలిపివేయబడినప్పటికీ చాలా మంది డిపాజిటర్లు ఇప్పటికీ ఈ పథకంలో యాక్టివ్ ఖాతాలను కలిగి ఉన్నారు. సెప్టెంబరు 30లోగా తమ డిపాజిట్లను ఉపసంహరించుకోవడంలో విఫలమైతే, వారి నిధులపై తదుపరి వడ్డీ చెల్లింపులు నిలిపివేయబడతాయని డిపాజిటర్లు పోస్టాఫీసుల్లో వ్యక్తిగతంగా కూడా తెలియజేయబడ్డారు.
నేషనల్ సేవింగ్స్ స్కీమ్ సవరణ రూల్స్, 2024 పేరుతో నోటిఫికేషన్లో ఇలా పేర్కొంది:
- మార్చి 1, 2003-సెప్టెంబర్ 30, 2024 వరకు వడ్డీ రేటు ఏడాదికి 7.5%గా ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం ఈ వడ్డీ రేటు కొనసాగుతుంది. అక్టోబర్ 1 నుంచి మాత్రం ఖాతాలోని సొమ్ముపై ఎలాంటి వడ్డీ అందించబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
- నెలలో 10వ తేదీ, నెలాఖరు వరకు ఖాతాలోని అత్యల్ప నిల్వ ఆధారంగా నెలవారీ వడ్డీ లెక్కించబడుతుంది. ఖాతాదారులకు నిర్దిష్ట వ్యవధిలో వారి అత్యల్ప బ్యాలెన్స్పై వడ్డీ జమ చేయబడుతుందని ఇది నిర్ధారిస్తుంది. సంపాదించిన వడ్డీ ప్రతి సంవత్సరం చివరిలో ఖాతాలో జమ చేయబడుతుంది
- మీరు అక్టోబర్ 1,2024కి ముందు NSS ఖాతాకు కంట్రిబ్యూట్ చేసినట్లయితే, మీరు సెప్టెంబరు 2024 చివరి వరకు సంవత్సరానికి 7.5% వడ్డీని పొందడం కొనసాగిస్తారు. అలాగే అక్టోబర్ 1, 2024 తర్వాత తెరిచిన ఏవైనా కొత్త డిపాజిట్లు లేదా ఖాతాల కోసం వడ్డీ అందించబడదని కేంద్రం తేల్చి చెప్పింది. అందువల్ల ఇన్వెస్టర్లు తమ డబ్బును మరో ప్రత్యామ్నాయ పెట్టుబడి ఎంపికలోకి ఈ డబ్బును డిపాజిట్ చేయటం ఉత్తమం పైగా అది వారి ఆర్థిక లక్ష్యాలను అందుకోవటంలో దోహదపడుతుంది.
- నేషనల్ సేవింగ్స్ స్కీమ్ చరిత్రను పరిశీలిస్తే 1987లో స్థాపించబడింది. అయితే చివరికి దీనిని 2002లో నిలిపివేసింది. ఇప్పటి వరకు ప్రభుత్వం స్కీమ్ కింద ఉన్న ఖాతాలను గౌరవిస్తూ వారికి వడ్డీ ఆదాయాన్ని చెల్లిస్తూ వచ్చింది. స్కీమ్ కింద ఏడాదికి రూ.40,000 వరకు డిపాజిట్ చేసేందుకు అనుమతిస్తుంది, సెక్షన్ 80సీ కింద ఈ పెట్టుబడిపై పన్ను ప్రయోజనం సైతం అందించబడింది. వాస్తవానికి ప్రారంభంలో నేషనల్ సేవింగ్స్ స్కీమ్ అత్యధికంగా 11 శాతం ఆకర్షణీయమైన వడ్డీ రేటును పెట్టుబడిదారులకు చెల్లించింది. కాల క్రమేణా దానిని 7.5 శాతానికి తగ్గించింది. జూలై 12 నుండి, పథకంలో మార్పులు అమలు చేయబడ్డాయి. 1987 పథకం కింద తమ ఖాతాలను తెరిచిన ఖాతాదారులు ప్రస్తుత రేటు ప్రకారం వడ్డీని పొందడం కొనసాగించారు. ఇదిలా ఉండగా.. అక్టోబర్లో ఎన్ఎస్ఎస్ వడ్డీ రేటును సున్నాకి తగ్గించింది.


Click it and Unblock the Notifications