ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఏటీఎంలో డబ్బులు ఉపసంహరించే కస్టమర్లకు అలర్ట్. రూ.10,000, అంతకంటే ఎక్కువ విత్డ్రా చేసే కస్టమర్లకు ఓటీపీ ఆధారిత ఉపసంహరణ సేవలను ఈ నేల 18వ తేదీ నుండి రౌండ్-ది-క్లాక్ అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఎస్బీఐ ఈ ఏడాది జవరి నెలలో ఓటీపీ ఆధారిత ఉపసంహరణను అందుబాటులోకి తెచ్చింది. అయితే అన్ని ఏటీఎంలలో ఈ వెసులుబాటును రాత్రి 8 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు అందుబాటులోకి తెచ్చింది. శుక్రవారం, 18వ తేదీ నుండి నిత్యం (24x7) అందుబాటులోకి తెస్తోంది.

ఓటీపీఆధారిత నగదుతో... ఎస్బీఐ ప్రకటన
24x7 OTP ఆధారిత నగదు ఉపసంహరణ సదుపాయాన్ని ప్రవేశపెట్టడంతో ఏటీఎంలో నగదు ఉపసంహరణలో భద్రతాస్థాయిని మరింత బలోపేతం చేసిందని, రోజంతా ఈ సదుపాయాన్ని అమలు చేయడంవల్ల ఎస్బీఐ డెబిట్ కార్డుదారులు... మోసగాళ్ల నుండి, అనధికార ఉసంహరణల నుండి, కార్డ్ స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్కు గురయ్యే ప్రమాదాల నుండి నిరోధించవచ్చునని ఎస్బీఐ తన ప్రకటనలో తెలిపింది. ఎటీఎం కేంద్రాల వద్ద మోసాలు, కార్డు క్లోనింగ్ సహా ఇతర ఫ్రాడ్స్ తగ్గించేందుకు ఈ సెక్యూరిటీ సిస్టంను అమలు చేస్తోంది ఎస్బీఐ. అయితే ఇప్పటి వరకు రాత్రి సమయానికే పరిమితమైన ఓటీపీ ఆధారిత ఉపసంహరణ ఇప్పుడు, రోజంతా ఉండనుంది.

రిజిస్టర్డ్ మొబైల్కు ఓటీపీ
ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేయాలంటే ముందుగా ఏటీఎంలో కార్డును స్వైప్ చేయాలి. రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తం తీసుకోవడానికి నెంబర్ ఎంటర్ చేస్తే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు OTP వస్తుంది. ఏటీఎం స్క్రీన్పై OTP విండో ఓపెన్ అవుతుంది. మొబైల్కు వచ్చిన ఓటీపీని అందులో ఎంటర్ చేయాలి. సరైన ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా అవుతాయి. పదివేల రూపాయల లోపు విత్ డ్రాకు ఓటీపీ అవసరం లేదు.

ఎస్బీఐ ఏటీఎంలలో మాత్రమే
ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ ఎస్బీఐ ఏటీఎంలలో మాత్రమే ఉంది. నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్(NFS) ఎస్బీయేతర ఏటీఎంలలో ఈ ఫంక్షన్ను డెవలప్ చేయనందున, ఓటీపీ ఆధారిత సేవలు కేవలం ఎస్బీఐ ఏటీఎంలలో మాత్రమే ఉన్నాయి. ఎస్బీఐ ఎండీ (రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ శెట్టీ మాట్లాడుతూ.. సాంకేతిక మెరుగుదల, భద్రతాస్థాయిని పెంచడం ద్వారా తన కస్టమర్లకు భద్రతను, సౌకర్యాలను పెంచడంలో ఎస్బీఐ ఎప్పుడూ ముందు ఉన్నదని చెప్పారు. 24x7 OTP ఆధారిత సేవలు కస్టమర్లకు సురక్షిత, ప్రమాదరహిత నగదు ఉపసంహరణ ఉంటుందని తెలిపారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications