భారతీ ఎయిర్ టెల్ కు చెందిన ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ మరో వినూత్న బ్యాంక్ ఖాతాను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఖాతా పేరు *భరోసా సేవింగ్స్ ఖాతా'. ఈ ఖాతా తెరిచిన కస్టమర్లు కనీస నిల్వను కొనసాగిస్తే ఉచిత ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ ఖాతాలో ఎంత కనీస నిల్వ ఉండాలి, ఎంత ప్రమాద బీమా కవరేజీ లభిస్తుంది తదితర వివరాలు తెలుసుకుందామా...

కనీస నిల్వ రూ.500
* దేశంలో ఇప్పటికీ అనేక మందికి బ్యాంకు ఖాతా సదుపాయం అందుబాటులో లేదు. బీమా పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ తెచ్చిన కొత్త ఖాతా ఈ రెండు అవసరాలను తీర్చేవిధంగా ఉంది.
* ఈ ఖాతాలో నెలవారీ కనీస నిల్వ కేవలం రూ.500 ఉంటే చాలు...రూ. 5 లక్షల ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీని అందిస్తోంది.
* ఈ సదుపాయం లభించాలంటే నెలలో కనీసం ఒక డెబిట్ లావాదేవీ నిర్వహించాలి.
* ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా అందిస్తున్న సబ్సిడీలను తమ భరోసా ఖాతా ద్వారా పొందాలని నిర్ణయించుకున్నా లేదా ఖాతాలో నగదు డిపాజిట్ చేసినా కూడా క్యాష్ బ్యాక్ కు అర్హులని చెబుతోంది.
* మార్కెట్లో పరిశోధన చేసిన తర్వాతనే ఈ ఖాతాను అందుబాటులోకి తెచ్చినట్టు బ్యాంకు చెబుతోంది. ఈ ఖాతా ద్వారా అధికారిక బ్యాంకింగ్ లావాదేవీలు మరింతగా పెరగడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
* భరోసా సేవింగ్స్ ఖాతా కస్టమర్లు దేశవ్యాప్తంగా ఉన్న 6.50 లక్షలకు పైగా ఏఈపీఎస్ ఎనేబుల్డ్ ఔట్లెట్ల ద్వారా నగదును తీసుకోవచ్చు. తమ ఖాతాలో నిల్వను చెక్ చెక్ చేసుకోవచ్చు. అంతే కాకుండా మినీ స్టేట్ మెంట్ కూడా తీసుకునే అవకాశం ఉంది.
* దేశంలో తొలుత ప్రారంభమైన పేమెంట్స్ బ్యాంక్ ఎయిర్ టెల్ పేమెంట్స్. ఇది సులభతరంగా డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసులను అందిస్తోంది.

మొబైల్ నెంబర్.. ఖాతానెంబర్ ఒకటే
* ఇప్పటికే ఎయిర్ టెల్ ఒక సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను అందిస్తోంది. ఖాతా దారు మొబైల్ నెంబరే వారి ఖాతా నెంబర్ గా ఉంటుంది.
* ఈ ఖాతాపై 4 శాతం వడ్డీ రేటును అందిస్తున్నారు. ఆన్ లైన్ కార్డు కూడా ఉంటుంది. దీన్ని ఆన్ లైన్ లావాదేవీల కోసం వినియోగించుకోవచ్చు.
* ఈ ఖాతాపై కూడా ఉచిత పర్సనల్ యాక్సిడెంట్ బీమాను అందిస్తున్నారు.
* లావాదేవీలు నిర్వహిస్తున్నదాన్ని బట్టి బీమా కాలపరిమితి పెరుగుతుంది.

నష్టం రూ. 339 కోట్లు
* 2018-19 ఆర్ధిక సంవత్సరంలో ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు పన్నుకు ముందు నష్టం రూ.338.8 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో పన్నులకు ముందు నష్టం రూ.272.6 కోట్లుగా ఉంది.
* 2019 మార్చి 31 తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే మొత్తం రాబడి దాదాపు 59 శాతం పెరిగి రూ. 254 కోట్లకు చేరుకుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications