పసిడి డిపాజిట్పై రెండు శాతం వడ్డీ..! (ఫోటోలు)
పసిడి డిపాజిట్ స్కీం, పసిడి బాండ్ల పథకాలను దీపావళి పండుగ నేపథ్యంలో ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాదు పసిడి డిపాజిట్లపై 1.5-2.0 శాతం వడ్డీ, అదే పసిడి బాండ్లపై 2-3 శాతం వడ్డీగా ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉందని ఆర్ధిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
2015-16 బడ్జెట్ ప్రతిపాదనలకు అనుగుణంగా ఈ రెండు పథకాలకు బుధవారం కేంద్ర మంత్రి వర్గం ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. సావరిన్ గోల్డ్ బాండ్ల స్కీంలను జారీ చేయడం ద్వారా కేంద్రం రూ.15 వేల కోట్ల నిధులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
రెండు నెలల్లోపే ఈ పథకాలను ప్రభుత్వం నోటిఫై చేస్తుందని సమాచారం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో సంప్రదింపుల అనంతరం, ఈ పథకాల ప్రారంభాన్ని ప్రభుత్వమే నిర్ణయిస్తుందని ఆర్ధిక శాఖ సీనియర్ అధికారి తెలిపారు.
ఈ రెండు పథకాలపై ప్రజల స్పందన ఎలా ఉందనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఏడాది తర్వాత వీటిని సమీక్షించడం జరుగుతుందని చెప్పారు.
పసిడి డిపాజిట్పై 2 శాతం వడ్డీ..!
పసిడి డిపాజిట్ స్కీం, పసిడి బాండ్ల పథకాలను దీపావళి పండుగ నేపథ్యంలో ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాదు పసిడి డిపాజిట్లపై 1.5-2.0 శాతం వడ్డీ, అదే పసిడి బాండ్లపై 2-3 శాతం వడ్డీగా ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉందని ఆర్ధిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
పసిడి డిపాజిట్పై 2 శాతం వడ్డీ..!
2015-16 బడ్జెట్ ప్రతిపాదనలకు అనుగుణంగా ఈ రెండు పథకాలకు బుధవారం కేంద్ర మంత్రి వర్గం ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. సావరిన్ గోల్డ్ బాండ్ల స్కీంలను జారీ చేయడం ద్వారా కేంద్రం రూ.15 వేల కోట్ల నిధులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
పసిడి డిపాజిట్పై 2 శాతం వడ్డీ..!
రెండు నెలల్లోపే ఈ పథకాలను ప్రభుత్వం నోటిఫై చేస్తుందని సమాచారం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో సంప్రదింపుల అనంతరం, ఈ పథకాల ప్రారంభాన్ని ప్రభుత్వమే నిర్ణయిస్తుందని ఆర్ధిక శాఖ సీనియర్ అధికారి తెలిపారు.
పసిడి డిపాజిట్పై 2 శాతం వడ్డీ..!
ఈ రెండు పథకాలపై ప్రజల స్పందన ఎలా ఉందనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఏడాది తర్వాత వీటిని సమీక్షించడం జరుగుతుందని చెప్పారు.