Zomato: ఆహార ప్రియులకు ఇకపై దూరం అడ్డుకాదంటోంది జొమాటో. మనం సహజంగా నచ్చిన వంటకాలను తినేందుకు ఇష్టమైన రెస్టారెంట్స్ కోసం మహా అయితే పదుల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉంటాం. అయితే నగరాలకు నగరాలనే దాటడం అంటే అది అసాధ్యం కూడా. కానీ ఇప్పుడు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే సర్వీసెస్ ను దేశీయ ఫుడ్ డెలివరీ దిగ్గజం సుసాధ్యం చేసి చూపిస్తానని అంటోంది. దీనికి అవసమరమైన కార్యాచరణను సైతం ప్రారంభించింది. ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే..
ఇంటర్సిటీ లెజెండ్స్..
జొమాటో తాజాగా ఇంటర్సిటీ లెజెండ్స్ అనే కొత్త డెలివరీ సర్వీసును దేశంలో పరిచయం చేస్తోంది. దీని ద్వారా ఇతర నగరాల్లో ఫేమస్ రెస్టారెంట్ల నుంచి వంటకాలను ఆర్డర్ చేసుకునే వెసులుబాటును భోజన ప్రియులకు పరిచయం చేస్తోంది. అయితే డెలివరీ కొన్ని సందర్భాల్లో ఒక రోజు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. ప్రస్తుతానికి Zomato ఈ డెలివరీ ఎంపికను కేవలం గుర్గావ్, దక్షిణ ఢిల్లీ కస్టమర్లకు మాత్రమే పరిమితం చేస్తోంది. అంటే ఈ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు మాత్రమే 'ఇంటర్సిటీ' ఆర్డర్లను ఇవ్వగలరు.

ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు?
కొత్త సర్వీస్ ద్వారా కస్టమర్లు " జైపూర్ నుంచి కచోరీ, కోల్కతా నుంచి కాల్చిన రోసోగొల్లాస్, హైదరాబాద్ నుంచి బిర్యానీ, బెంగళూరు నుంచి మైసూర్ పాక్, లక్నో నుంచి కబాబ్లు, ఓల్డ్ ఢిల్లీ నుంచి బటర్ చికెన్ లేదా ప్యాజ్ వంటి ఫేమస్ వంటకాలను ఆర్డర్ చేసి ఆస్వాధించడానికి వెసులుబాటు ఉంటుందని." జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ఒక బ్లాగ్ పోస్ట్లో వెల్లడించారు. ప్రస్తుతం ఈ జాబితాలో కోల్కతా, హైదరాబాద్, లఖ్నో, జైపూర్, బెంగళూరు, మధుర, చెన్నై, ఆగ్రా, భువనేశ్వర్ నుంచి కస్టమర్లు ఇష్టమైన ఫుడ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు.

అన్ని రెస్టారెంట్లకు అనుమతి ఉంటుందా..?
అనుమతించబడిన జాబితాలోని నగరాల్లోని అన్ని రెస్టారెంట్లు ఈ సర్వీస్ కింద అనుమతించబడవు. కేవలం ఎంపిక చేసిన కొన్నింటికే ఈ అవకాశాన్ని జొమాటో అందిస్తోంది. ఉదాహరణకు లఖ్నోలో కేవలం ఏడు రెస్టారెంట్లు మాత్రమే ఈ జాబితాలో కనిపించాయి. అవి కూడా అత్యధికంగా అమ్ముడైన, ఫేమస్ వంటకాలు మాత్రమే సర్వ్ చేయబడతాయి.

స్పెషల్ ప్యాకింగ్..
ఇతర నగరాలకు ఆహారాన్ని విమానం ద్వారా పంపటం జరుగుతుంది. రెస్టారెంట్ తాజాగా ఆహారాన్ని సిద్ధం చేసిన తరువాత.. సురక్షితంగా రవాణా చేసేందుకు రీయూజబుల్, ట్యాంపర్ ఫ్రూఫ్ కంటైనర్లలో ప్యాక్ చేస్తారు. ఆహారం చెడిపోకుండా ఉంచేందుకు అత్యాధునిక మొబైల్ శీతలీకరణ సాంకేతికతను వినియోగిస్తారు. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపబోమని కంపెనీ వెల్లడించింది. కస్టమర్లు ఆహారాన్ని అందుకున్న తరువాత "మైక్రోవేవ్, ఎయిర్-ఫ్రై లేదా పాన్-ఫ్రై" వినియోగించి హాట్ గా సర్వ్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ పనిలో దేశంలోని 100 విమానాశ్రయాలు పనిచేయనున్నట్లు తెలుస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications