ప్రముఖ ఫుడ్ డెలివరీ స్టార్టుప్ కంపెనీ జొమాటో... గ్రోసరీ డెలివరీ సర్వీసుల నుంచి తప్పుకోనుంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఎంట్రాకర్ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఫుడ్ డెలివరీ లో పట్టు సంపాదించి దేశంలో ఆ రంగంలో స్విగ్గి తో పోటీ పడుతోంది. అయితే ఇటీవలే గ్రోసరీస్ డెలివరీ విభాగంలోకి కూడా అడుగిడింది.
దేశంలోని సుమారు 80 నగరాల్లో ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది కూడా. కానీ అంతలోనే మళ్ళీ సర్వీసులను నిలిపివేస్తుండటం గమనార్హం. జొమాటో మార్కెట్ అనే బ్రాండ్ కింద ప్రారంభించిన గ్రోసరీ సర్వీసుల నిలిపివేత చాలా మంది విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది నిజానికి ఆశ్చర్యానికి గురిచేసే విషయమే అయినా... చిన్న పట్టణాల్లో జొమాటో తన జొమాటో మార్కెట్ సేవలను తగ్గిస్తూ వస్తోంది.
ప్రతి డెలివరీ పైనా నష్టాన్ని చవిచూస్తుండటంతో పాటు నష్టాలను తగ్గించుకొని తన కోర్ బిజినెస్ పై ఫోకస్ చేయాలని భావిస్తున్నట్లు ఉంది అని ఈ విషయంపై అవగాహన ఉన్న వ్యక్తి చెప్పినట్లు ఎంట్రాకర్ వెల్లడించింది.

స్విగ్గి తో పోటీ లో భాగమే...
ఫుడ్ డెలివరీ లో దేశంలో స్విగ్గి, జొమాటో రెండు మాత్రమే రేసులో ఉన్నాయి. దీంతో పోటీదారు ఒకరు ఏ పని చేస్తే సరిగ్గా అదే పనిని మరో కంపెనీ కూడా ప్రారంభించటం సర్వ సాధారణం. స్విగ్గి దాదాపు ఏడాది కాలంగా గ్రోసరీస్ డెలివరీ చేపడుతోంది. ఫుడ్ బిజినెస్ లో తగ్గుతున్న వ్యాపారాన్ని గ్రోసరీస్ తో పూడ్చుకోవాలని స్విగ్గి దానిని ప్రారంభించి. కాబట్టి, వెంటనే సరిగ్గా అదే బిజినెస్ విభాగాన్ని జొమాటో కూడా ప్రారంభించింది. కరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్ డౌన్ వల్ల ఫుడ్ బిజినెస్ బాగా దెబ్బతింది. సరిగ్గా ఇదే సమయంలో గ్రోసరీస్ బిజినెస్ బాగా పుంజుకుంది. అందుకే స్విగ్గి ఈ విభాగంపై ఫోకస్ పెంచింది. అయితే గ్రోసరీస్ డెలివరీ కి ప్రత్యేక వ్యాపార వ్యూహాలు అవసరమవుతాయి. ఇప్పుడున్న వ్యవస్థతోనే గ్రోసరీస్ కూడా డెలివరీ చేయటం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. సరిగ్గా ఇదే అంశాన్ని జొమాటో గుర్తించినట్లుంది.

ఆల్కహాల్ డెలివరీ కూడా...
లాక్ డౌన్ లో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో ఫుడ్ డెలివరీ పై నిషేధం కొనసాగింది. దీంతో స్విగ్గి, జొమాటో రెండూ కూడా బాగా దెబ్బతిన్నాయి. 70-80% ఆర్డర్లు పడిపోవటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఈ కంపెనీలు కొత్త విభాగాలపై దృష్టిసారించాయి. ఇందులో భాగంగా స్విగ్గి, జొమాటో ఆల్కహాల్ హోమ్ డెలివరీ సేవలను కూడా ప్రారంభించాయి. ఛత్తీస్గఢ్ సహా మరిన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లిక్కర్ డెలివరీ కి అనుమతించడంతో ఇందులోకి ప్రవేశించాయి. అయితే, లిక్కర్ డెలివరీ సేవలను ఎంత కాలంపాటు ప్రభుత్వాలు అనుమతిస్తాయో తెలియదు. మధ్యలో మళ్ళీ అనుమతులను రద్దు చేస్తే ఇవి కొత్త వ్యాపార అవకాశాలను వెతుక్కోవాల్సి ఉంటుంది.

సేవలు కొనసాగుతాయి...
ఇదిలా ఉండగా... జొమాటో మార్కెట్ సేవల నిలిపివేత గురించి ఎంట్రాకర్ వివరణ కోరగా... ఆ సేవలు కొనసాగుతాయని కంపెనీ బదులిచ్చింది. కానీ ఇతర వివరాలు వెల్లడించలేదు. అదే సమయంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని సేవలు ప్రారంభం అవుతున్నాయి కాబట్టి మళ్ళీ ఫుడ్ డెలివరీ సేవలపై ద్రుష్టి సారించామని, వినియోగదారులకు శుభ్రత, భద్రత లతో కూడిన భోజనం డెలివరీ చేయటంపైనే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నామని జొమాటో వివరణ ఇచ్చింది. కాగా, ప్రముఖ గ్రోసరీ సేవల సంస్థ గ్రోఫెర్స్ తో కూడా జొమాటో విలీన చర్చలు జరుగుతున్నట్లు కొంత కాలంగా వార్తలు వెలువడుతున్నాయి. కానీ అందులో పెద్దగా పురోగతి లేదని తెలుస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications