Zomato IPO: యాంకర్ ఇన్వెస్టర్ల నుండి రూ.4,196 కోట్లు
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఐపీవోలో విక్రయించడానికి ఉద్దేశించిన దాని కంటే యాంకర్ పెట్టుబడుల నుండి 35 రెట్ల ఎక్కువ బిడ్స్ పొందింది. ఒక్కో షేరుకు రూ.72 నుండి రూ.76గా ధరను నిర్ణయించారు. ఐపీవో కంటే ముందు యాంకర్ పెట్టుబడిదారుల నుండి రూ.4196 కోట్లకు పైగా వచ్చినట్లు జొమాటో తెలిపింది. ట్రాన్సాక్షన్ పరిమాణాన్ని రూ.419.51 కోట్లకు కలిపి యాంకర్ ఇన్వెస్టర్లకు రూ.55,21,73,505 ఈక్విటీ షేర్లను ఒక్కొక్కటిగా కేటాయించాలని కంపెనీ నిర్ణయించినట్లు ఫైలింగ్లో తెలిపింది.
జొమాటో యాంకర్ పెట్టుబడిదారుల్లో బ్లాక్ రాక్, టైగర్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ ఫండ్, ఫిడిలిటీ, న్యూవరల్డ్ ఫండ్ ఇంక్, జేపీ మోర్గాన్, మోర్గాన్ స్టాన్లీ ఆసియా, గోల్డ్మన్ సాచ్, టిరో, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్, సింగపూర్ ప్రభుత్వం, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్, అబుదబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఉన్నాయి.
యాంకర్ బిడ్డింగ్లో పాల్గొన్న దేశీయ పెట్టుబడిదారుల్లో కొటక్ మ్యూచువల్ ఫండ్స్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్స్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీ, HDFC లైఫ్ ఇన్సురెన్స్, ఐడీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్స్, సుందరం మ్యూచువల్ ఫండ్స్, ఎడెల్విసిస్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఈ ఐపీవోను కొటక్ మహీంద్రా క్యాపిటల్, మోర్గాన్ స్టాన్లీ, క్రెడిట్ సూయిజ్, బోఫా సెక్యూరిటీస్ సిటీ గ్రూప్ నిర్వహిస్తున్నాయి.