IT News: ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఐటీ సేవలను అందిస్తూ భారత్ ఈ రంగంలో అగ్రగామిగా ముందుకు సాగుతోంది. నైపుణ్యం కలిగిన యువత, తక్కువ ఖర్చుకు సేవలు అందుబాటులో ఉండటంతో గ్లోబల్ స్థాయిలో టెక్ రంగం మెరుస్తోంది.
అయితే ఈ ఐటీ కోటకు బీటలు వారుతున్నాయి. గత ఏడాది చివర్లో మెుదలైన అలజడులు 2023 ప్రారంభం నుంచి భారత ఐటీ, టెక్ సేవల రంగం భారీగా సవాళ్లను ఎదుర్కొంటోంది. రానున్న త్రైమాసికాల్లో అంచనాలు సైతం షాకింగ్ గానే కొనసాగుతున్నాయి. ఇప్పటికే యాక్సెంచర్ అందించిన వివరాలు కంపెనీల్లో ఆందోళనలను రేకెత్తిస్తుండగా.. ఆ పరిశ్రమలోని ప్రముఖులు గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయని బాహాటంగానే చెబుతున్నారు.

దేశంలోని ప్రముఖ సాఫ్ట్వేర్ సేవల సంస్థ ZOHO చైర్మన్, వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు పరిశ్రమ పరిస్థితులపై సంచలన ట్వీట్ పోస్ట్ చేశారు. ఇప్పటికే జీతాల పెంపులు లేక, వేరియబుల్ పే చెల్లింపుల్లో కోతలు ఎదుర్కొంటున్న టెక్కీలను ఇది నిజంగా నిద్ర పోనివ్వటం లేదు. గడచిన సెప్టెంబర్ మాసంలో ప్రపంచ వ్యాప్తంగా అనని దేశాల్లో, అన్ని ప్రాజెక్టుల్లో వృద్ధి నెమ్మదించిందని తాము గమనించినట్లు వెంబు తెలిపారు. ఇది ఆదాయ స్థాయిలపై కూడా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
తన అంచనాల ప్రకారం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ గడ్డు స్థితికి చేరుకుందని పేర్కొన్నారు. ఇది అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన తరుణంగా తాను భావిస్తున్నట్లు తెలిపారు. గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ గత కొన్ని నెలలుగా కుంటుపడుతోన్న సంగతి అనేక నివేదికలు చెబుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ షట్డౌన్ అంచుల వరకు వెళ్లి చివరి నిమిషాల్లో ఊరట పొందిన సంగతి తెలిసిందే. దీనికి తోడు చాలా యూరోపియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు అధిక ద్రవ్యోల్బణం కారణంగా మాంద్యంలోకి జారుకున్నాయి. చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధి, వినియోగం రేటు కూడా భారీగా క్షీణించటంతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల రుణ స్థాయి పెరగటం ఆందోళనలు కలిగిస్తోంది.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications