నెలకు రూ.8 వేలతో జీవితాన్ని మొదలు పెట్టిన వ్యక్తి ఇప్పుడు బిలియనీర్ అయ్యాడు. అతనే నిఖిల్ కామత్. నిఖిల్ 17 ఏళ్ల కాల్ సెంటర్ లో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు.వచ్చే రూ.8వేల జీతంలో కొంత డబ్బుతో స్టాక్లలో ట్రేడింగ్ ప్రారంభించాడు. మొదట్లో చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి లైట్ తీసుకున్నాడు. కానీ సంవత్సరం తర్వాత సీరియస్గా తీసుకున్నాడు. కామత్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత విజయవంతమైన స్టాక్ బ్రోకరేజ్ సంస్థకు నాయకత్వం వహిస్తున్నాడు.

తండ్రి ఇచ్చిన డబ్బుతో
హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి తన ప్రయాణం, తండ్రి తన పొదుపులో కొంత భాగం ఇవ్వడంపై జెరోధా సహ-వ్యవస్థాపకులు కామత్ మాట్లాడారు. తన తండ్రి పొదుపు చేసిన కొంత భాగం తనకు ఇచ్చాడని ఆ డబ్బుతోనే ట్రైడింగ్ మొదలు పెట్టినట్లు నిఖిల్ కామత్ వివరించారు. ఆ తర్వాత, కాల్ సెంటర్లోని తన మేనేజర్ కొంత డబ్బు ఇచ్చి ట్రేడింగ్ చేయమని కోరాడు.

2010లో జెరోధా
ట్రేడింగ్ చేయడంతో డబ్బు వచ్చింది. ఈ విషయం కొందరికి తెలిసి వారు తమకు తరఫున ట్రేడింగ్ చేయాలని కోరారు. వారి డబ్బుతో స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టి లాభాలు తెచ్చాడు. దీంతో ఉద్యోగం మానేసి ట్రేడింగ్ చేయాలని నిర్ణయించుకున్నానని కామత్ చెప్పాడు. "తర్వాత నేను మా సోదరుడితో కలిసి కామత్ అసోసియేట్స్ను ప్రారంభించామని, 2010లో మేము జెరోధాను ప్రారంభించాము!" నిఖిల్ కామత్ పేర్కొన్నాడు.

వారు నాపై నమ్మకం ఉంచారు
చదువు మానేసి తనకు డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ఉందన్నాడు. ఎందుకంటే తను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని వివరించాడు. అలాగే తన కజిన్స్ ఎంబీఏ పూర్తి ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. దీంతో తను ఏం చేస్తావని చాలా మంది ప్రశ్నించారని వివరించాడు. అయితే తన తల్లిదండ్రులకు తనపై నమ్మకం ఉంచారని గుర్తు చేసుకున్నాడు.

పట్టుదలతో పని చేస్తే..
"స్కూల్ డ్రాపౌట్ నుంచి, కాల్ సెంటర్లో పని చేయడం, జెరోధా, ట్రూ బెకన్ వరకు తను రెండు-మూడు విషయాలను గుర్తించానని నిఖిల్ కామత్ చెప్పారు. పని చేయడం వల్లే ఈ స్థాయికి వచ్చానని, తను ఇప్పటికి ఓపిక ఉన్నంత వరకు పని చేస్తానని పేర్కొన్నారు. నా ఏకైక సూచన ఏమిటంటే.. ప్రస్తుత అవరోధాల గురించి పట్టించుకోవద్దు. ఈ రోజు చేసే పని ఈ రోజే చేయండి. పట్టుదలతో ముందుకెళ్తే విజయం సాధిస్తారని కామత్ స్పష్టం చేశారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications