Zee Entertainment: చాలా కాలం తర్వాత జీ, సోనీ కలయికకు లైన్ క్లియర్ అయ్యింది. దీనికోసం మార్కెట్లో ఇన్వెస్టర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.
నేడు జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ను సోనీ ఇండియాలో విలీనం చేసేందుకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT) ఆమోదం తెలిపింది. ఇది 10 బిలియన్ డాలర్ల మీడియాను సృష్టించే లక్ష్యంతో మెగా విలీనానికి కీలకమైన నియంత్రణ ఆమోదం. ఈ డీల్ 2021లోనే ప్రకటించబడినప్పటికీ అనేక కారణాల వల్ల ఆలస్యం అయ్యింది.

జీ కంపెనీ ప్రమోటార్లు దాని అతిపెద్ద ఇన్వెస్టర్ల మధ్య జరిగిన న్యాయపోరాటం కారణంగా ఆలస్యం జరిగింది. ఆ తర్వాత Zeeకి వ్యతిరేకంగా దాఖలైన దివాలా కేసు ఫిబ్రవరిలో నిలిపివేయబడింది. డిసెంబర్ 2021లో జీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్ తమ వ్యాపారాలను కలపడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుని అవసరమైన ఆమోదం కోసం ట్రైబ్యునల్ను, ఇతర సంస్థలను ఆశ్రయించాయి.
గత నెలలో యాక్సిస్ ఫైనాన్స్, JC ఫ్లవర్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కో, IDBI బ్యాంక్, Imax Corp, IDBI ట్రస్టీషిప్తో సహా స్కీమ్పై అభ్యంతరం వ్యక్తం చేసిన రుణదాతల వాదనలు విన్న NCLT ముంబై బెంచ్ ఆర్డర్ను రిజర్వ్ చేసింది. ZEE కంపెనీ మొత్తం పబ్లిక్ షేర్హోల్డింగ్ 96.01 శాతం కాగా.. ఇందులో 70 శాతం పబ్లిక్ ఇన్స్టిట్యూషన్లు కలిగి ఉన్నాయి. ప్రభుత్వేతర సంస్థలు 25.88 శాతం, ప్రమోటర్లు 3.99 శాతం మాత్రమే కలిగి ఉన్నట్లు వెల్లడైంది. తాజాగా నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ గ్రీన్ సిగ్నల్ అందించటంతో ఇన్వెస్టర్లలో సంతోషం నెలకొంది. మార్కెట్లు ముగిసే సమయానికి జీ కంపెనీ షేర్ ధర 15 శాతం మేర లాభపడి రూ.281.80 వద్ద ట్రేడింగ్ ముగించింది. దీంతో షేర్ ధర ఒక్కరోజులోనే 40 రూపాయల మేర పెరిగింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications