హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులోని భారతి సిమెంట్స్లో ఈడీ జఫ్తు చేసిన ఆస్తులపై యథాస్థితిని కొనసాగించాలని ఇటీవల హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భారతి సిమెంట్స్ కేసులో 2016 జూన్లో రూ.749 కోట్ల స్థిర, చరాస్తులను గతంలో ఈడీ తాత్కాలికంగా జఫ్తు చేసింది.

నాడు జగన్ ఆస్తులు అటాచ్
ఈడీ తాత్కాలికంగా జఫ్తు చేసిన వాటిల్లో జగన్, ఆయన కంపెనీలకు చెందిన రూ.569.57 కోట్లు, ఆయన భార్య భారతికి చెందిన రూ.22.31 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చిన తాత్కాలిక జఫ్తు ఉత్తర్వుల్ని అడ్జ్యుటికేటింగ్ అథారిటీ ధృవీకరించింది. దీనిపై జగన్, భారతి, సండూరు పవర్స్ తదితర సంస్థలు అప్పిలేట్ ట్రైబ్యునల్ను ఆశ్రయించాయి. విచారణ చేపట్టిన ట్రైబ్యునల్ ఈడీ డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చిన తాత్కాలిక జఫ్తు ఉత్తర్వులు చెల్లవని జూలైలో తీర్పు ఇచ్చింది.

యథాతథస్థితి..
ఈ తీర్పును సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఆస్తుల జఫ్తుకు సంబంధించి అప్పిలేట్ అథారిటీ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యథాతథస్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

జగన్, భారతిలకు నోటీసులు
ప్రతివాదులుగా ఉన్న జగన్, భారతి, కంపెనీలు, వివిధ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. వివిధ కేసుల్లో ఏ1గా ఉన్న ఆయనకు ఇటీవల సీబీఐ కోర్టు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications