బ్యాంక్ లాకర్ రూల్స్: డెడ్లైన్ మిస్ అయితే మీ లాకర్ సీజ్ అవుతుందా ? ఆర్బీఐ హెచ్చరిక..
మీ విలువైన వస్తువులు, ఆభరణాలు భద్రంగా ఉండాలని బ్యాంకు లాకర్ని అద్దెకు తీసుకున్నారా లేదా ఉపయోగిస్తున్నారా ? అయితే ఈ వార్త మీ కోసమే. గత కొన్ని సంవత్సరాలుగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంక్ లాకర్లకు సంబంధించిన నియమాలను సవరించింది. ఈ నిబంధనల ప్రకారం, లాకర్ అద్దె తీసుకున్నవారు కొత్త లాకర్ ఒప్పందంపై తప్పనిసరిగా సంతకం చేయాలి. అలా చేయకపోతే మీ లాకర్ను బ్యాంక్ సీల్ చేసే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.

నిబంధనలు పాటించకపోతే లాకర్ సీజ్: అందిన సమాచారం ప్రకారం, బ్యాంకు లాకర్లు అద్దెకు తీసుకున్న కస్టమర్ల దాదాపు 20% మంది ఆర్బీఐ విధించిన గడువు తర్వాత కూడా కొత్త ఒప్పందంపై సంతకం చేయలేదు. ఇప్పుడు వారి లాకర్లను సీల్ చేసే ప్రమాదం ఉంది. సవరించిన లాకర్ ఒప్పందంలో బ్యాంక్ లాకర్లో ఉంచిన వస్తువులను భద్రంగా ఉంచలేకపోతే, కస్టమర్ చట్టపరమైన పరిష్కారాలను కోరవచ్చని స్పష్టంగా పేర్కొంది. అదేవిధంగా, లాకర్కు సంబంధించిన నియమాలను పాటించని కస్టమర్లపై బ్యాంకులు చర్యలు తీసుకోవచ్చు. ఆర్బీఐ ఈ మొత్తం వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షిస్తోంది.
ఆర్బీఐ అనుమతి కోరిన బ్యాంకులు: ఎకనామిక్ టైమ్స్ (ET) లో ప్రచురితమైన వార్తల ప్రకారం, నిబంధనలు పాటించని కస్టమర్లకు చివరి నోటీసులు పంపడానికి లాకర్లను సీల్ చేయడానికి అనుమతి ఇవ్వాలని బ్యాంకులు ఆర్బీఐని సంప్రదించాయి. దీని ఉద్దేశ్యం నిబంధనలను పటిష్టంగా అమలు చేయడం, బ్యాంకులపై పర్యవేక్షణ సమస్యలను తగ్గించడం. ప్రస్తుతం, బ్యాంకులు ఒప్పంద రెన్యూవల్ గురించి కస్టమర్లకు నోటీసులు పంపుతున్నాయి. ఆర్బీఐ జారీ చేసిన అప్ డేట్ లాకర్ ఒప్పంద మార్గదర్శకాలు మార్చి 2024 నాటికి పూర్తిగా అమలు చేయాలి.
పదే పదే గుర్తు చేసినా స్పందించని కస్టమర్లు: ఆగస్టు 2021లో కస్టమర్ల ఫిర్యాదులు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత లాకర్ హోల్డర్లతో కొత్త ఒప్పందాన్ని 1 జనవరి 2023 నాటికి అమలు చేయాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. ఈ గడువును మొదట డిసెంబర్ 2023 వరకు, ఆపై 31 మార్చి 2024 వరకు పొడిగించారు. పదే పదే గుర్తు చేసినప్పటికీ, కొందరు కస్టమర్లు ఇంకా స్పందించలేదని బ్యాంక్ అధికారులు తెలిపారు. కొన్ని కేసులలో సంబంధిత పార్టీల మధ్య చట్టపరమైన వివాదాలు కూడా ఉన్నాయి.
కొత్త గడువు డిసెంబర్ 2025: ఆర్బీఐతో జరిగిన చర్చల సందర్భంగా, కొంతమంది బ్యాంక్ అధికారులు లాకర్ కార్యకలాపాలను నిలిపివేయడానికి, నిబంధనలు పాటించకపోతే కస్టమర్లకు నోటీసులు జారీ చేయడానికి అనుమతి కోరారు. అలాగే, నిబంధనలను పాటించడానికి ఎక్కువ సమయం ఇవ్వాలని, గడువును డిసెంబర్ 2025 వరకు పొడిగించాలని బ్యాంకులు ఆర్బీఐకి సూచించాయి. కస్టమర్లు తక్షణమే వారి బ్యాంకులను సంప్రదించి, కొత్త లాకర్ ఒప్పందంపై సంతకం చేయాలని సూచించింది.


Click it and Unblock the Notifications