Yes Bank Q3 Results: చాలా కాలంగా యెస్ బ్యాంక్ ఇన్వెస్టర్లు మంచిరోజుల కోసం వేచి చూస్తున్నారు. దాదాపు 5 ఏళ్ల కిందట కంపెనీలో జరిగిన అవకతవకల గురించి బయటకు రావటంతో పెట్టుబడిదారులు ప్రైవేటు బ్యాంకుపై నమ్మకం పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. సకాలంలో స్పందించిన రిజర్వు బ్యాంక్ దీనిని కుప్పకూలిపోకుండా నిరోధించింది.
ఆ సమయంలో యెస్ బ్యాంకులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ బ్యాంక్ వంటి సంస్థలు మూలధన అవసరాల కోసం భారీగా పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత బ్యాంక్ పనితీరు వరుసగా మెరుగుపడుతూ పెట్టుబడిదారుల్లో సంతోషాన్ని నింపుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో నికర లాభం మూడు రెట్లు పెరగటంతో రూ.612 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయంలో బ్యాంక్ లాభం కేవలం రూ.231 కోట్లుగా ఉన్న సంగతి తెలిసిందే. అంటే వార్షిక ప్రాతిపధికన కంపెనీ లాభాలు దాదాపు 165 శాతం వృద్ధిని సాధించాయి.

ఈ పరిస్థితులపై పెట్టుబడిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యెస్ బ్యాంకుకు తిరిగి మంచి రోజులు మెుదలయ్యాయని, కంపెనీ పనితీరు వేగంగా మెరుగుపడుతోందని వారు భావిస్తున్నారు. శుక్రవారం మార్కెట్ల ముగింపు నాటికి బ్యాంక్ షేర్ల ధర ఒక్కోటి రూ.18.25 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. ఇక మూడవ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.9,341 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో బ్యాంక్ ఆదాయం రూ.8,179 కోట్లుగా ఉంది.
అలాగే బ్యాంక్ సమీక్షా కాలంలో వడ్డీ రూపంలో 7,829 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందింది. అయితే గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.6984 కోట్ల కంటే ఇది చాలా ఎక్కువ. నికర వడ్డీ ఆదాయం డిసెంబర్ త్రైమాసికంలో 10 శాతం పెరిగి రూ.2,224 కోట్లకు చేరింది. ఇక స్థూల నిరర్థక ఆస్తుల విషయానికి వస్తే గత ఏడాది త్రైమాసికంలో 2 శాతం నుంచి ప్రస్తుతం 1.6 శాతానికి తగ్గటంతో బ్యాంక్ ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. ఇదే క్రమంలో నికర మెుండి బకాయిలు ఏడాది ప్రాతిపదికన 0.9 శాతం నుంచి 0.5 శాతానికి తగ్గి మెరుగుపడ్డాయి.
బ్యాంక్ వరుసగా ఐదవ త్రైమాసికంలో బలమైన లాభాల వృద్ధిని సాధించటంపై సీఈవో, ఎండీ ప్రశాంత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఆస్తులపై లాభాలు భారీగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. వ్యాపారంలో కూడా తాము మంచి లాభాలను చూస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే త్వరలోనే బ్రోకరేజీలు కూడా ఫలితాలకు అనుగుణంగా స్టాక్ టార్గెట్ ధరలను అప్ గ్రేడ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బ్యాంక్ షేర్ల కొనుగోలుపై ఇన్వెస్టర్లు కూడా సరైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నవంబరులో యెస్ బ్యాంక్ షేర్లపై ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు కోటక్, జేఎం ఫైనాన్షియల్ సెల్ రేటింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications