తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఇప్పుడు ఒక భారీ ఆర్థిక వివాదంలో చిక్కుకుంది. భక్తులు ఎంతో భక్తితో సమర్పించిన బంగారం (gold) తో తయారు చేసిన నాణేలు ఆలయ ఖజానా నుంచి మాయమయ్యాయి. తాజాగా వెలుగు చూసిన ఈ ఉదంతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ అక్రమాలు తాజాగా జరిగిన ఆడిట్ లో వెలుగుచూడటంతో ఆలయ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

అసలేం జరిగింది?
యాదగిరిగుట్ట ఆలయంలో గత రెండు దశాబ్దాలుగా స్వామివారి ప్రతిమతో కూడిన బంగారం (gold) అలాగే వెండి నాణేలను భక్తులకు విక్రయిస్తున్నారు. వీటిని డాలర్లు అని పిలుస్తారు. భక్తులు సమర్పించే బంగారు కానుకలను సేకరించి, వాటిని ప్రభుత్వ మింట్ కు పంపి నాణేలుగా చేయిస్తారు. అయితే ఈసారి రికార్డుల్లో ఉన్న లెక్కలకు, స్టాక్ రూమ్ లో ఉన్న బంగారు నాణేలకు మధ్య భారీ తేడా కనిపించింది. దాదాపు రూ. 10 లక్షల విలువైన గోల్డ్ కాయిన్స్ మాయమైనట్లు ప్రాథమిక అంచనాలో తేలింది.
పర్యవేక్షణ లోపమా? లేక భారీ కుంభకోణమా?
ఆలయ పబ్లిసిటీ విభాగం ఆధ్వర్యంలో ఈ నాణేల విక్రయాలు జరుగుతుంటాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (AEO) ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉండాల్సిన ఈ బంగారం స్టాక్.. రికార్డులకు దొరకకుండా ఎలా మాయమైంది? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. గతంలో ఇదే ఆలయం నుంచి చింతపండు బస్తాలు మాయమైనప్పుడు పెద్ద దుమారం రేగింది. కానీ, ఇప్పుడు ఏకంగా విలువైన బగారు నాణేలే గల్లంతు కావడం అధికారుల నిర్లక్ష్యాన్ని వేలెత్తి చూపుతోంది.
కొత్త ఈఓ భవాని శంకర్ కఠిన హెచ్చరిక
ఈ వివాదం నడుస్తుండగానే, కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) గా భవాని శంకర్ బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే ఈ బంగారు నాణేలు మిస్సింగ్ కేసును సీరియస్ గా తీసుకున్నారు. "ఆడిట్ నివేదికను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ఒక్క గ్రాము గోల్డ్ తక్కువగా ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దీనికి బాధ్యులైన సిబ్బందిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటాం" అని ఆయన స్పష్టం చేశారు.
భక్తుల ఆందోళన
స్వామివారికి భక్తితో సమర్పించిన కానుకలకు రక్షణ లేకపోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పరిపాలనలో రాజకీయ జోక్యం లేదా అధికారుల ఉదాసీనత వల్లే ఇలాంటి కుంభకోణాలు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపి, స్వామివారి సొమ్మును రికవరీ చేయాలని కోరుతున్నారు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది .. కొనుగోలు వెంటనే బంద్ చేయండి.. మార్చి 10, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

బంగారం, వెండి ధరలు: MCXలో లాభాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంపై కీలక విషయాలు వెల్లడి!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు: ఇరాన్ వార్ కారణంగా భారత్లో భారీగా పెరిగిన ధరలు - కారణాలు, ప్రభావాలు

బంగారం ధరలు ఢమాల్..ఈ రోజు ఎంత తగ్గిందో తెలిస్తే పండగ చేసుకుంటారు .. మార్చి 4,బుధవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications