9 నెలల గరిష్టానికి హోల్సేల్ రిటైల్ ద్రవ్యోల్భణం
అక్టోబర్ నెలలో హోల్సేల్ ద్రవ్యోల్భణం (WPI) తొమ్మిది నెలల గరిష్టానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం గణాంకాలు విడుదల చేసింది. అక్టోబర్లో 1.48 శాతంగా ఉన్న WPI సూచీ నవంబర్లో 1.55 శాతానికి పెరిగింది. గత నెలలో ఆహార పదార్థాల ధరలు కాస్త తగ్గినప్పటికీ, తయారీరంగ ఉత్పత్తుల ధరలు పెరిగాయి. దీంతో WPI పెరిగిందని చెబుతున్నారు. ఫిబ్రవరి (2.26 శాతం) తర్వాత WPI ఇదే అత్యధికం.
నవంబర్ నెలలో ఆహార ద్రవ్యోల్భణం 6.37 శాతంగా ఉంది. అంతకుముందు అక్టోబర్ నెలలో 3.94 శాతంగా నమోదయింది. కూరగాయలు, ఆలు ధరలు గరిష్టంగా వరుసగా 12.24 శాతం, 115.12 శాతం పెరిగాయి. నాన్-ఫుడ్ వస్తువుల ద్రవ్యోల్భణం 8.43 శాతం పెరిగింది. ఇంధనం, పవర్ ద్రవ్యోల్భణం మాత్రం నవంబర్ నెలలో 9.87 శాతం తగ్గింది.
ద్రవ్యోల్భణం ఇంకా గరిష్టస్థాయిలోనే ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి విధాన సమీక్షలో పేర్కొన్న విషయం తెలిసిందే. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్భణం 6.8 శాతంగా ఉండవచ్చునని ఆర్బీఐ అంచనా వేసింది.