నవంబర్లో 71 నెలల గరిష్టానికి ఆహార ద్రవ్యోల్భణం
న్యూఢిల్లీ: ఆహార పదార్థాల ధరలు పెరగడంతో టోకు ధరల సూచీ (WPI) ఆధారిత ద్రవ్యోల్భణం పెరిగింది. నవంబర్ నెలలో 0.58 శాతం పెరుగుదల నమోదు చేసింది. అంతకుముందు నెలలో WPI 0.16 శాతంగా ఉంది. గత ఏఢాది ఇదే నెలలో 4.47 శాతంగా నమోదయింది. ఆహార ద్రవ్యోల్భణం నవంబర్ నెలలో 71 నెలల గరిష్టానికి చేరుకుంది.
భారత వృద్ధి రేటుపై గృహ వినియోగం దెబ్బ, షాకిచ్చిన మూడీస్! కారణాలివే..
ఈ మేరకు కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ సోమవారం నివేదిక విడుదల చేసింది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ నవంబర్ నెలలో 0.6 శాతం పెరిగింది. అంతకుముందు నెలలో ఇది 0.2 శాతం పెరిగింది. ఆఙార పదార్థాల ధరలుఅక్టోబర్ నెలలో 9.8 శాతం ఉండగా, నవంబర్ నెలలో 11.1 శాతానికి చేరుకున్నాయి.
గత వారం విడుదల చేసిన రిటైల్ ద్రవ్యోల్భణం మూడేళ్ల గరిష్టానికి చేరుకుంది. పారిశ్రామికోత్పత్తి కూడా క్షీణించింది. కూరగాయలు, పప్పులు, చికెన్ వంటి ఆహార పదార్థాల ధరలు పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్భణం 5.54 శాతం పెరిగి మూడేళ్ల గరిష్టానికి చేరుకుంది. విద్యుత్, మైనింగ్, తయారీ రంగాల వృద్ధి మందగించింది. దీంతో పారిశ్రామికోత్పత్తి తగ్గిపోయింది.
ఉల్లి ధరలు ఇటీవల భారీగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. నవంబర్ నెలలో ఉల్లి ధర ద్రవ్యోల్భణం 172.3 శాతానికి పెరిగింది. అంతకుముందు నెలలో అంటే అక్టోబర్లో ఇది 119.8 శాతంగా ఉంది. కూరగాయలు 45.3 శాతానికి పెరిగాయి. అంతకుముందు (అక్టోబర్) ఇది 38.91 శాతంగా ఉంది.