ముంబై: బ్రిటన్లో కొత్త రకం కరోనా వైరస్ వెలుగు చూడటంతో ప్రపంచ మార్కెట్లు నష్టపోయాయి. దీంతో ఆసియా, భారత మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. ఇన్వెస్టర్ల సంపద నిన్న ఒక్కరోజే రూ.6.59 లక్షల కోట్లు హరించుకుపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్లో 30 షేర్లు 1,406.73 పాయింట్లు నష్టపోయాయి. నిఫ్టీ 13,350 దిగువకు చేరుకుంది. అమ్మకాల ఒత్తిడితో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,59,313 క్షీణించి రూ.1,78,79,323 కోట్లకు పడిపోయింది. ఆసియా మార్కెట్లో హాంగ్కాంగ్, టోక్యో నష్టపోగా, షాంఘై, సియోల్ పెరిగాయి. ఐరోపో స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.

చిన్న షేర్లు డౌన్
ఉదయం ప్రారంభంలోనే సెన్సెక్స్ 46,932 పాయింట్ల వద్ద బలహీనంగా ప్రారంభమైంది. తర్వాత కాస్త కోలుకున్నట్లుగా కనిపించింది. ఇంట్రాడేలో 47,055 మార్క్ను దాటింది. అయితే కాసేపట్లోనే అమ్మకాల ఒత్తిడికి గురై నష్టాల్లోకి వెళ్లింది. ఓ దశలో 2000 పాయింట్ల నష్టంలోకి వెళ్లింది. 44,923 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 45,554 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 432 పాయింట్లు పతనమై 13,328 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఇంట్రాడేలో 13,131 వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 30లో అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈలో 2472 షేర్లు నష్టాల్లో, 564 షేర్లు లాభాల్లో ముగియగా, 156 షేర్లలో మార్పులేదు. బ్లూచిప్లతో పోలిస్తే చిన్న, మధ్యస్థాయి కంపెనీలు అమ్మకాల ఒత్తిడిని ఎక్కువగా ఎధుర్కొన్నాయి. స్మాల్ క్యాప్ 4.57 శాతం, మిడ్ క్యాప్ 4.14 శాతం నష్టపోయాయి.

ఈ 5 కంపెనీలకే రూ.2 లక్షల కోట్ల నష్టం
గత 11 సెషన్లుగా మార్కెట్లు లాభాల్లో ఉండగా, ఒక్కరోజులో అవన్నీ గాల్లో కలిశాయి. ఏడు నెలల కాలంలో సెన్సెక్స్స్ భారీ పతనం ఇదే. మే తర్వాత మళ్లీ మార్కెట్లు వరస్ట్గా ముగిశాయి. మార్కెట్లో ఎక్కువగా నష్టపోయిన 5 కంపెనీల షేర్ల కారణంగా వాటి మార్కెట్ క్యాప్ రూ.1.95 లక్షల కోట్లు తుిచి పెట్టుకుపోయింది. రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.13.47 లక్షల కోట్ల నుండి రూ.12.26 లక్షల కోట్లకు తగ్గింది. ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.18,000 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.16,000 కోట్లు, ఐటీసీ ఎం-క్యాప్ రూ.18,000 కోట్లు, హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాప్ రూ.15,000 కోట్ల చొప్పున తగ్గింది. నిన్న నిమిషానికి రూ.1850 కోట్ల నష్టం వాటిల్లింది.

కొన్ని మాత్రం..
500 షేర్ల వరకు లోయర్ సర్క్యూట్ను తాకాయి. స్పైస్ జెట్, గ్రాఫైట్ ఇండియా, టాటా స్టీల్ వంటి షేర్లు ఉన్నాయి. మార్కెట్ భారీగా పతనమైనప్పటికీ బిర్లా సాఫ్ట్, క్యాడిల్లా హెల్త్ కేర్, హెచ్ఐఎల్ వంటి కొన్ని షేర్లు లాభాల్లో ముగిశాయి.
ఇక, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ సూచీలు మూడు శాతం వరకు నష్టంతో ముగిశాయి. ఆసియాలో జపాన్, థాయ్లాండ్, హాంకాంగ్, సింగపూర్ ఈక్విటీ సూచీలు ఒక శాతం నుండి 5 శాతం వరకు నష్టాలతో ముగిశాయి. నాస్డాక్, ఎస్ అండ్ పీ, డీ జోన్స్ 0.6 శాతం నుండి 0.7 శాతం వరకు నష్టపోయాయి.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications