కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా పని విధానాల్లో వచ్చిన అతిపెద్ద మార్పు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పవచ్చు. అయితే 2025 నాటికి ఆ మోడల్ క్రమంగా ముగింపు దశకు చేరుకుంటున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ టెక్, ఫైనాన్స్, కన్సల్టింగ్ కంపెనీలు ఉద్యోగులను మళ్లీ పూర్తిస్థాయిలో కార్యాలయాలకు పిలవడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
2025 ప్రారంభంలోనే అమెజాన్ ఈ విధానంపై కీలక నిర్ణయం తీసుకుంది. తన ఉద్యోగులు వారానికి ఐదు రోజులు కార్యాలయానికి రావాల్సిందేనని స్పష్టం చేసింది. ఆ వెంటనే డెల్, ఐబిఎం, మెటా, సేల్స్ఫోర్స్, స్నాప్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ వంటి దిగ్గజ టెక్ సంస్థలు కూడా ఇలాంటి విధానాలనే అమలు చేయడం ప్రారంభించాయి. ఫైనాన్స్ రంగంలో గోల్డ్మన్ సాచ్స్, జేపీ మోర్గాన్, మోర్గాన్ స్టాన్లీ లాంటి సంస్థలు ఇప్పటికే ఆఫీస్ వర్క్కు బలమైన మద్దతు ఇస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ రంగంలో డిస్నీ, టెలికాం రంగంలో ఎటి అండ్ టి కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి.

సంవత్సరం చివర్లో ఇన్స్టాగ్రామ్ సీఈఓ ఆడమ్ మోస్సేరి చేసిన ప్రకటన ఈ మార్పును మరింత బలపరిచింది. ఆయన పంపిన కంపెనీవైడ్ మెమో ప్రకారం.. ఫిబ్రవరి 2 నుంచి అమెరికాలోని ఉద్యోగులు పూర్తిస్థాయిలో కార్యాలయాలకు తిరిగి రావాల్సి ఉంటుంది. ఇది మెటా గ్రూప్లో కూడా రిటర్న్-టు-ఆఫీస్ విధానం ఎంత గట్టిగా అమలవుతుందో చూపిస్తోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద రిక్రూట్మెంట్ సంస్థలలో ఒకటైన రాండ్స్టాడ్ గ్లోబల్ సీఈఓ సాండర్ వాంట్ నూర్డెండే దీనిపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఫార్చ్యూన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. గ్రేట్ రిటర్న్-టు-ఆఫీస్ వార్ ఇప్పుడు ముగిసింది. ఇకపై పూర్తిగా రిమోట్ ఉద్యోగాలు సాధారణ ఉద్యోగుల కోసం కాకుండా.. స్టార్ పెర్ఫార్మర్లు లేదా అత్యంత ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారికే పరిమితమవుతాయని చెప్పారు. 100 శాతం రిమోట్ ఉద్యోగాన్ని డిమాండ్ చేయాలంటే, మీరు చాలా ప్రత్యేకంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
కార్న్ ఫెర్రీ సంస్థ కూడా ఇదే విషయాన్ని తన తాజా నివేదికలో వెల్లడించింది. కంపెనీలు ఆఫీస్ వర్క్పై మరింత దృష్టి పెట్టడంతో.. కొత్త హైబ్రిడ్ సోపానక్రమం ఏర్పడుతుందని అంచనా వేసింది. ఇందులో ఫ్లెక్సిబిలిటీ అనేది అందరికీ లభించే హక్కుగా కాకుండా.. టాప్ టాలెంట్కు మాత్రమే ఇచ్చే ప్రత్యేక సౌకర్యంగా మారనుంది. 2025లో ఉద్యోగ మార్కెట్లో ఉన్నవారు - లేనివారు అన్న విభజన ఆర్థిక పరిస్థితుల వల్ల కాకుండా.. ప్రతిభ, కంపెనీకి ఆ ఉద్యోగి ఎంత అవసరమో అనే అంశాలపై ఆధారపడి ఉంటుందని నివేదిక పేర్కొంది.
జూనియర్ స్థాయి లేదా సులభంగా భర్తీ చేయగల పాత్రల్లో ఉన్న ఉద్యోగులు మాత్రం కార్యాలయానికి రావాల్సిందేనని కంపెనీలు స్పష్టంగా చెబుతున్నాయి. అమెజాన్ క్లౌడ్ విభాగం అధిపతి మాట్ గార్మాన్ అయితే.. కార్యాలయం నుంచి పని చేయడాన్ని అంగీకరించని వారు వెళ్లిపోవచ్చని కూడా హెచ్చరించినట్లు సమాచారం. ఏదేమైనా రిమోట్, హైబ్రిడ్ మోడళ్లకు 2025లో పెద్ద ఎత్తున బ్రేక్ పడుతోంది. ఐదేళ్ల రిమోట్ వర్క్ ప్రయోగం తర్వాత.. ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచం మళ్లీ కార్యాలయాలకు ఉద్యోగులను పిలుస్తోంది. Work from home కు శాశ్వత వీడ్కోలు పలికేందుకు రెడీ అవుతోంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications