Liquor: చీర్స్ అంటూ అమ్మాయిలు చిల్ అయిపోవటం ఈ రోజుల్లో సర్వ సాధారణంగా మారిపోయింది. ఇలాంటి సీన్స్ మనం జంబలకిడి పంబ సినిమాలో ఒకప్పుడు చూశాం. కానీ ఇది శ్రుచిమించుతోందని తాజా సర్వే వెల్లడించింది.

CADD సర్వే ఫలితాలు..
దేశంలో మద్యం వినియోగం వేగంగా పెరుగుతోందని తేలింది. దీపావళికి ముందు మూడు రోజులు అమ్మకాల షాకింగ్ డేటా ఇదే వెల్లడించింది. దిల్లీ వాసులు ఏకంగా రూ.100 కోట్లకు పైగా మద్యాన్ని తాగేశారని సర్వే వెల్లడించింది. అయితే ఈ విషయంలో మహిళలపై చేసిన సర్వే ప్రకారం మద్యం తాగే మహిళలు మునుపటి కంటే ఎక్కువయ్యారని తెలిసింది. సర్వేలో 5000 మంది మహిళలు పాల్గొనగా వారిలో 77 శాతం మందిని డిస్కౌంట్లు ఎక్కువగా ఆకర్షించాయని చెప్పారు.

కరోనా కాలంలో..
సాధారణ సమయంలో కంటే కరోనా కాలంలో మహిళలు ఎక్కువ మద్యం సేవించారని సర్వేలో వెల్లడైంది. ఆందోళనల నుంచి బయటపడేందుకు చాలా మంది ఈ మార్గాన్ని ఎంచుకున్నారని తేలింది. మహిళల్లో 37.6 శాతం మంది తమ మద్యపానం పెరిగినట్లు CADD సర్వేలో తెలిపారు. 42.3 శాతం మంది మహిళలు సందర్భానుసారంగా మద్యపానం పెరిగిందని చెప్పారు. కరోనా తర్వాత 2022 నుంచి పరిస్థితులు సాధారణ స్థితికి రావటంతో మద్యం అమ్మకాలు పెరిగాయి.

మహిళల మాట ఇదే..
మహిళల్లో అతిగా మద్యం సేవించేందుకు ఒత్తిడి, ఆందోళనలే ప్రధాన కారణమని వెల్లడైంది. డేటాను పరిశీలిస్తే.. 45.7 శాతం మంది మహిళల్లో వినియోగం పెరగడానికి కారణం టెన్షన్ అని తేలింది. ఇది కాకుండా మద్యం సులువుగా లభించడం వల్ల కూడా వినియోగం పెరిగిందని 34.4 శాతం మంది అభిప్రాయపడ్డారు. తమలోని విసుగును అధిగమించేందుకు మద్యాన్ని సేవించినట్లు సర్వేలో పాల్గోన్న 30.1 శాతం మంది స్పష్ట చేశారు.

ఆల్కహాల్ చెడ్డదికాదు..
పురుషులతో పోల్చినప్పుడు క్రమం తప్పకుండా మద్యం తాగే మహిళల సంఖ్య తక్కువగానే ఉంది. కానీ సర్వేలో పాల్గొన్నవారిలో కేవలం 7 శాతం మంది మాత్రమే మద్యాన్ని హానికరమైనదిగా, ప్రమాదకరమైనదిగా భావిస్తున్నామని అంగీకరించారు. ఇందులో వారానికి రెండు సార్లు మద్యం సేవిస్తున్నవారి సంఖ్య 38.1% ఉండగా.. వారానికి నాలుగురోజులు మద్యం తాగుతున్న మహిళల సంఖ్య 19.1% గా ఉందని సర్వే వెల్లడించింది.

రోజూ తాగుతున్నారు..
రోజూ 1-2 పానీయాలు తాగుతున్న మహిళల సంఖ్య 36.7%, రోజుకు 3-4 పానీయాలు తాగుతున్న మహిళల సంఖ్య 34.9% ఉండగా.. ఒకేసారి నాలుగు లేదా అంతకంటే ఎక్కువ పానీయాలు తాగుతున్న మహిళల సంఖ్య 28.4% గా ఉందని తేలింది. సర్వేలో పాల్గొన్నవారిలో 18-30 వయస్కులు - 1453, 31- 45 వయస్కులు - 2021, 46- 60 వయస్కులు - 1206, 60 ఏళ్ల వయస్కులు - 320 మంది మహిళలు సర్వేలో పాల్గొన్నారు.

రాజధాని నగరంలో..
దేశరాజధాని ఢిల్లీలో అమ్మకాలు 87% పెరుగుతాయని అంచనా వేయబడింది. ఇందులో విస్కీ అమ్మకాలు 59.5 శాతం పెరగగా.. బీర్ అమ్మకాలు 5.5 శాతం మేర పెరిగాయి. డిస్కౌంట్ల వల్ల ఎక్కువ మద్యంపై ఖర్చుచేసినట్లు 39.8% మంది చెప్పటం గమనార్హం. 34.1% మంది ఇంట్లోనే మద్యపానం చేసేందుకు ఇష్టపడుతున్నట్లు చెప్పారు. కాగా ఇదే సమయంలో 32.7% మంది మాత్రం బార్లు, పబ్లకు వెళ్లడానికి ఇష్టపడుతున్నామని వెల్లడించారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications