Gold Rate: గోల్డ్ ముట్టుకుంటే రేటు షాక్.. నేడు రూ.10,400 పెరిగిన ధర, తెలుగు రాష్ట్రాల్లో తులం రేటిదే..

Gold Price Today: సంక్రాంతి సందళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన తర్వాత పసిడి ధరలు అంతరీక్షానికి ప్రయాణిస్తున్నాయి. అయితే ఈ రేట్ల పెరుగుదల బడ్జెట్ తర్వాత మరింత వేగంగా జరుగుతోంది. దీంతో భవిష్యత్తులో బంగారం ధర 10 గ్రాములకు రూ.90,000 మార్కును చేరుకుంటుందనే ఆందోళనలు కొనసాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు షాపింగ్ చేసే ప్రజలు తప్పక రేట్లను తెలుసుకోండి.

గోల్డ్ రేట్ల ర్యాలీ ఎందుకు..?
ప్రస్తుతం పెరుగుతున్న పసిడి ధరలు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. వాస్తవానికి అమెరికా తాజా ట్రేడ్ టారిఫ్స్ కారణంగా ముందస్తు వ్యూహాత్మక రక్షణ చర్యల్లో భాగంగా చైనా నుంచి పసిడి డిమాండ్ పెరగటంతో అంతర్జాతీయంగా పసిడి ధరలు సరికొత్త రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి. ప్రస్తుతం చైనా-యూఎస్ ట్రేడ్ వార్ కారణంగా అప్రమత్తమైన ప్రపంచ దేశాల నుంచి కూడా పసిడికి డిమాండ్ పెరుగుతోంది. దీనికి అదనంగా అమెరికా జాబ్ డేటా, ద్రవ్యోల్బణం, నెమ్మదిగా కొనసాగుతున్న ఆర్థిక వ్యవస్థ వంటి ఇతర కారణాలు సైతం పసిడి పరుగుకు కారణంగా ఉన్నాయి.

With US Trade Tariffs war Gold rates heating Rising rates shocking Indian Buyers in Hyderabad

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.9,500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7905, ముంబైలో రూ.7905, దిల్లీలో రూ.7920, కలకత్తాలో రూ.7905, బెంగళూరులో రూ.7905, కేరళలో రూ.7905, వడోదరలో రూ.7910, జైపూరులో రూ.7920, లక్నోలో రూ.7920, బెంగళూరులో రూ.7905, నాశిక్ లో రూ.7908, అయోధ్యలో రూ.7920, బళ్లారిలో రూ.7905, గురుగ్రాములో రూ.7920, నోయిడాలో రూ.7920 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.10,400 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8624, ముంబైలో రూ.8624, దిల్లీలో రూ.8639, కలకత్తాలో రూ.8624, బెంగళూరులో రూ.8624, కేరళలో రూ.8624, వడోదరలో రూ.8629, జైపూరులో రూ.8639, లక్నోలో రూ.8639, బెంగళూరులో రూ.8624, నాశిక్ లో రూ.8627, అయోధ్యలో రూ.7920, బళ్లారిలో రూ.8624, గురుగ్రాములో రూ.8639, నోయిడాలో రూ.8639గా ఉన్నాయి. అయితే ఈ ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి, వ్యాపారి లాభాలు వంటివి కలపకముందువిగా గుర్తుంచుకోవాలి.

తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7905గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8624 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1000 పెరిగి రూ.1,07,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

మెుత్తం మీద ఈవారంలో కూడా బంగారం, వెండి ధరల అధిక ఒడిదొడుకులను చూస్తాయని భావిస్తున్నట్లు పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎలా ఉండనుందనే ఆందోళనలు అస్థిరతకు కారణమని వెల్లడించారు. ఇదే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఇనాగరల్ స్పీచ్ సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు చాలా అధిక ఓలటాలిటీకి గురైంది. రానున్న రోజుల్లో ఉక్రెయిన్-రష్యాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగితే పసిడికి డిమాండ్ తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+