EPFO: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)పై జూలై 29, 30 తేదీల్లో జరిగే సమావేశంలో కేంద్రీకృత పెన్షన్ పంపిణీ వ్యవస్థ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించిన తర్వాత దానిని ఆమోదించనుంది. ఈ వ్యవస్థ ఏర్పాటుతో దేశవ్యాప్తంగా 73 లక్షల మంది పింఛనుదారుల ఖాతాలకు ఒకేసారి పింఛను బదిలీ చేయవచ్చు.

ప్రస్తుతం పెన్షన్ విధానం ఇలా..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా EPFOకి ఉన్న 138 ప్రాంతీయ కార్యాలయాలు వారి ప్రాంతంలోని లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్ను బదిలీ చేస్తున్నాయి. అయితే దీని వల్ల అందరికీ ఒకే సారి కాకుడా వేరువేరు రోజుల్లో, సమయాల్లో పెన్షన్ అందుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను నివారించేందుకు కొత్త విధానాన్ని తీసుకురానుంది. జూలై 29, 30 తేదీల్లో జరిగే EPFO అపెక్స్ డెసిషన్ మేకింగ్ బాడీ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో కేంద్ర పెన్షన్ పంపిణీ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రతిపాదించనున్నట్లు సమాచారం.

కొత్త విధానం తరువాత..
ఈ విధానం ఏర్పాటైన తర్వాత.. 138 ప్రాంతీయ కార్యాలయాల డేటాబేస్ ఆధారంగా పింఛన్ పంపిణీ జరుగుతుందని పింఛన్ వర్గాలు తెలిపాయి. దీంతో 73 లక్షల మంది పింఛన్దారులకు ఏకకాలంలో డబ్బు అందుతుంది. అన్ని ప్రాంతీయ కార్యాలయాలు తమ ప్రాంతంలోని పింఛనుదారుల అవసరాలను భిన్నంగా చూస్తాయని చెల్లింపు అధికారులు ద్వారా తెలుస్తోంది. అందువల్ల వివిధ చోట్ల డబ్బు చెల్లించే తేదీలు వేరుగా ఉన్నాయని వారు అంటున్నారు.

గత సమావేశంలో ఇలా..
20 నవంబర్ 2021న జరిగిన CBT 229వ సమావేశంలో.. C-DAC ద్వారా కేంద్రీకృత ఐటీ ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేసే ప్రతిపాదనను ట్రస్టీలు ఆమోదించారు. దీని తర్వాత ప్రాంతీయ కార్యాలయాల వివరాలను దశలవారీగా కేంద్ర డేటాబేస్కు బదిలీ చేస్తామని సమావేశం అనంతరం కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది సేవల ఆపరేషన్, సరఫరాను సులభతరం చేస్తుందని అప్పట్లో వెల్లడించారు.


Click it and Unblock the Notifications