Indian Investments: భారతీయ ఇన్వెస్టర్లు, పెట్టుబడి మార్కెట్ గత 3 సంవత్సరాలుగా విపరీతమైన మార్పు, అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలోనూ అనేక ప్రముఖ పెట్టుబడిదారులు, పెట్టుబడి సంస్థలు కరోనా కాలంలో కూడా మంచి లాభాలను చూశాయి. అయితే ప్రస్తుతం 2022 సంవత్సరం మాత్రం ఆర్థికంగా చాలా చెడ్డ దశను ఎదుర్కొంటోంది.

చైనా-తైవాన్ లలో ఇన్వెస్టర్ల పరిస్థితి..
ప్రస్తుత పరిస్థితులను గమనించినట్లయితే.. ముఖ్యంగా అమెరికాకు చెందిన బ్లాక్రాక్, జపాన్కు చెందిన సాఫ్ట్బ్యాంక్ భారీ క్షీణతను ఎదుర్కొంటున్నాయి. ఇదే సమయంలో దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ పెట్టుబడుల విలువ కూడా భారీగా క్షీణించటం ప్రస్తత పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ పరిస్థితిలో.. చైనా - తైవాన్ మధ్య సమస్యలో అంరికా జోక్యం పెట్టుబడిదారులకు కొత్త చిక్కులను తెచ్చిపెట్టింది. ఈ తరుణంలో చైనా-తైవాన్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారి పరిస్థితి ఏమిటి..? ఇప్పుడు చూద్దాం..

భారత ఇన్వెస్టర్లు..
భారతీయ ఇన్వెస్టర్లు ఏళ్ల తరబడి అమెరికా మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారు. దేశీయ ఇన్వెస్టర్లు కొన్నేళ్ల క్రితం తమ పెట్టుబడులను చైనా, హాంకాంగ్, తైవాన్లతో కూడిన గ్రేటర్ చైనా ప్రాంతానికి తరలించారు. ఈ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసిన చాలా మంది మంచి రాబడులు ఆర్జించారు. అయితే.. గత కొన్నేళ్లుగా కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయని ఒప్పుకోక తప్పదు.

తలనొప్పిగా చైనా-తైవాన్ సమస్య..
చైనా-తైవాన్ సమస్య తారాస్థాయికి చేరుకుంటున్న తరుణంలో ఆ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన భారతీయ ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగాయి. చైనా, హాంకాంగ్, తైవాన్ మార్కెట్లను కలిగి ఉన్న గ్రేటర్ చైనా ప్రాంతంపై దృష్టి సారించే మూడు భారతీయ ఈక్విటీ ప్రాజెక్ట్లు ఉన్నాయి. వీటి పనితీరుపై ప్రభావం పడనుంది.

యాక్సిస్, నిప్పాన్ ఫండ్స్..
యాక్సిస్ గ్రేటర్ చైనా ఈక్విటీ ఫిబ్రవరి 2021లో ప్రారంభమైంది. ఈ స్కీమ్ పెట్టుబడి విలువ ఏడాది కాలంలో 22% తగ్గింది. డిసెంబర్ 2021లో ప్రారంభించిన నిప్పాన్ ఇండియా తైవాన్ ఈక్విటీ ఫండ్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇది ప్రారంభం నుంచి 30% తగ్గింది. ఈ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టిన వారికి ప్రస్తుతం కన్నీరే మిగిలిందని చెప్పుకోక తప్పదు.

చైనాలో పెట్టుబడులు ఇలా..
2009లో ప్రారంభించబడిన ఎడెల్వీస్ గ్రేటర్ చైనా ఈక్విటీ 28% పడిపోయింది. విదేశీ పెట్టుబడులపై నియంత్రణ పరిమితుల కారణంగా యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కొత్త పెట్టుబడులను నిలిపివేసింది.

ఆంక్షలతో నష్టాలు..
ఈ భారీ క్షీణతకు కేవలం చైనా-తైవాన్ మాత్రమే కాదు, గత సంవత్సరాల్లో చైనా ప్రభుత్వ టెక్ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలపై కఠిన చర్యలు, ఆంక్షల వల్ల కూడా సంభవించింది. ఇప్పుడు చైనా తైవాన్పై దాడి చేస్తే.. మ్యూచువల్ ఫండ్ కంపెనీల పెట్టుబడుల్లో నష్టం 50 శాతానికి మించి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆశగా పెట్టుబడులు పెట్టిన అనేక మందికి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఊహించని షాక్ ఇచ్చాయని చెప్పుకోవాలి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications