Bonus Shares: లక్షను రూ.40 లక్షలు చేసిన స్టాక్.. 14వ సారి బోనస్ షేర్లను అందిస్తోంది..!

Wipro Share Price: దేశీయంగా నేడు ఐటీ కంపెనీల షేర్లు బూమ్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లకు టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న విప్రో నుంచి ఒక శుభవార్త ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడిదారుల తలరాతను మార్చేసిన విప్రో కంపెనీ త్వరలోనే మరోసారి ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపించటానికి సిద్ధం అవుతోందని తెలుస్తోంది.

టెక్ కంపెనీ మరోసారి తన పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను అందించాలని చూస్తోంది. దీంతో 14వ సారి కూడా విప్రో తన ఇన్వెస్టర్లకు ఉచితంగా షేర్లను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ తన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను అక్టోబర్ 17న ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం బోర్డు సమావేశం కానుంది. టెక్ దిగ్గజం విప్రో ఈ క్రమంలో ఫలితాలతో పాటు, షేర్ల బోనస్ ఇష్యూను కూడా ప్రకటించనున్నట్లు అక్టోబర్ 13 నాటి ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్ ప్రకారం వెల్లడైంది.

Wipro stock turned 1 lakh into 40 lakhs with bonus shares issues Know details

2019 తర్వాత కంపెనీ 14వ సారి తన ఇన్వెస్టర్లకు ఉచిత షేర్లను అందించటానికి తాజాగా సిద్ధం అవుతోందని వెల్లడైంది. దీనికి ముందు కంపెనీ 1971, 1981, 1985, 1987, 1989, 1992, 1995, 1997, 2004, 2005, 2010, 2017. 2019లో తన ఇన్వెస్టర్లకు ఉచిత షేర్లను బహుకరించింది. చివరిగా 2019లో 1:3 రేషియోలో బోనస్ షేర్లను ఇన్వెస్టర్లకు అందించింది. ఇప్పటికే టెక్ దిగ్గజం టీసీఎస్ తన ఫలితాలను వెల్లడించిన వేళ.. ఫలితాలతో పాటు, రాబోయే త్రైమాసికంలో ఆదాయ వృద్ధిపై విప్రో మార్గదర్శకత్వంపై అందిరి దృష్టి ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే దేశీయ బ్రోకరేజ్ కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ విప్రో రాబోయే త్రైమాసికానికి 0.5% ఆదాయ క్షీణత నుంచి 1.5% వృద్ధికి మార్గనిర్దేశం చేస్తుందని అంచనా వేస్తోంది.

దీర్ఘకాలిక పెట్టుబడిదారుల సంపదను ఐటీ స్టాక్ మల్టీబ్యాగర్ రాబడులతో రెట్టింపు చేసింది. గడచిన 16 ఏళ్ల కాలంలో బలమైన రాబడి అందించిన టెక్ కంపెనీ షేర్ల ధర 2008 అక్టోబర్ 10న రూ.59.28 వద్ద ఉంది. ఈ ధర వద్ద కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టుబడిగా పెట్టి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే అప్పటి షేర్ల సంఖ్య 1686 స్థాయి నుంచి ప్రస్తుతం 7493కి పెరిగాయి. దీనికి కారణంగా కంపెనీ ఇప్పటి వరకు దాదాపు 13 సార్లు బోనస్ షేర్లను ఇష్యూ చేయటమే. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 7493 విప్రో షేర్ల విలువ రూ.40 లక్షలు దాటిపోయింది.

ఇంట్రాడేలో మధ్యాహ్నం 1.33 గంటల సమయంలో విప్రో షేర్ల ధర ఎన్ఎస్ఈలో రూ.549 వద్ద కొనసాగుతోంది. కంపెనీ బోనస్ షేర్లను ప్రకటించిన తర్వాత మార్కెట్లో దాదాపు 4 శాతం మేర షేర్లు లాభాలను చూశాయి. ఇదే క్రమంలో స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.579.90గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.375.05 వద్ద ఉంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2.87 లక్షల కోట్లుగా కొనసాగుతోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+