Wipro Share Price: దేశీయంగా నేడు ఐటీ కంపెనీల షేర్లు బూమ్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లకు టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న విప్రో నుంచి ఒక శుభవార్త ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడిదారుల తలరాతను మార్చేసిన విప్రో కంపెనీ త్వరలోనే మరోసారి ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపించటానికి సిద్ధం అవుతోందని తెలుస్తోంది.
టెక్ కంపెనీ మరోసారి తన పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను అందించాలని చూస్తోంది. దీంతో 14వ సారి కూడా విప్రో తన ఇన్వెస్టర్లకు ఉచితంగా షేర్లను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ తన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను అక్టోబర్ 17న ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం బోర్డు సమావేశం కానుంది. టెక్ దిగ్గజం విప్రో ఈ క్రమంలో ఫలితాలతో పాటు, షేర్ల బోనస్ ఇష్యూను కూడా ప్రకటించనున్నట్లు అక్టోబర్ 13 నాటి ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్ ప్రకారం వెల్లడైంది.

2019 తర్వాత కంపెనీ 14వ సారి తన ఇన్వెస్టర్లకు ఉచిత షేర్లను అందించటానికి తాజాగా సిద్ధం అవుతోందని వెల్లడైంది. దీనికి ముందు కంపెనీ 1971, 1981, 1985, 1987, 1989, 1992, 1995, 1997, 2004, 2005, 2010, 2017. 2019లో తన ఇన్వెస్టర్లకు ఉచిత షేర్లను బహుకరించింది. చివరిగా 2019లో 1:3 రేషియోలో బోనస్ షేర్లను ఇన్వెస్టర్లకు అందించింది. ఇప్పటికే టెక్ దిగ్గజం టీసీఎస్ తన ఫలితాలను వెల్లడించిన వేళ.. ఫలితాలతో పాటు, రాబోయే త్రైమాసికంలో ఆదాయ వృద్ధిపై విప్రో మార్గదర్శకత్వంపై అందిరి దృష్టి ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే దేశీయ బ్రోకరేజ్ కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ విప్రో రాబోయే త్రైమాసికానికి 0.5% ఆదాయ క్షీణత నుంచి 1.5% వృద్ధికి మార్గనిర్దేశం చేస్తుందని అంచనా వేస్తోంది.
దీర్ఘకాలిక పెట్టుబడిదారుల సంపదను ఐటీ స్టాక్ మల్టీబ్యాగర్ రాబడులతో రెట్టింపు చేసింది. గడచిన 16 ఏళ్ల కాలంలో బలమైన రాబడి అందించిన టెక్ కంపెనీ షేర్ల ధర 2008 అక్టోబర్ 10న రూ.59.28 వద్ద ఉంది. ఈ ధర వద్ద కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టుబడిగా పెట్టి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే అప్పటి షేర్ల సంఖ్య 1686 స్థాయి నుంచి ప్రస్తుతం 7493కి పెరిగాయి. దీనికి కారణంగా కంపెనీ ఇప్పటి వరకు దాదాపు 13 సార్లు బోనస్ షేర్లను ఇష్యూ చేయటమే. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 7493 విప్రో షేర్ల విలువ రూ.40 లక్షలు దాటిపోయింది.
ఇంట్రాడేలో మధ్యాహ్నం 1.33 గంటల సమయంలో విప్రో షేర్ల ధర ఎన్ఎస్ఈలో రూ.549 వద్ద కొనసాగుతోంది. కంపెనీ బోనస్ షేర్లను ప్రకటించిన తర్వాత మార్కెట్లో దాదాపు 4 శాతం మేర షేర్లు లాభాలను చూశాయి. ఇదే క్రమంలో స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.579.90గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.375.05 వద్ద ఉంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2.87 లక్షల కోట్లుగా కొనసాగుతోంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications