Wipro News: దేశీయ స్టాక్ మార్కెట్లకు శనివారం, ఆదివారం సెలవని మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో శనివారం టెక్ దిగ్గజం విప్రోలో పెద్ద పరిణామం చోటుచేసుకుంది. సీఈవోగా ఉన్న థియరీ డెలాపోర్టే హఠాత్తుగా తన రాజీనామా ప్రకటించటంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది.
ఇది ఐటీ సేవల రంగంలోని కంపెనీల అగ్రనాయకత్వాలు ఎదుర్కొంటున్న టఫ్ పరిస్థితులకు అద్దం పడుతోందని కొందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే సోమవారం మార్కెట్లు తెరచుకోగానే టాప్ టెక్ కంపెనీల్లో ఒకటైన విప్రో షేర్లలో పతనం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ రాజీనామా కంపెనీ నాలుగో త్రైమాసిక ఫలితాలకు ముందు రావటం కంపెనీకి పెద్ద దెబ్బని చెప్పుకోవాలి.

ప్రస్తుతం దేశంలోని ఐటీ సేవల కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను వెల్లడించేందుకు సిద్ధం అవుతున్నాయి. ముందుకు టీసీఎస్ నుంచి ఇవి ప్రారంభం అవుతుండగా.. విప్రో తన ఫలితాలను కూడా వచ్చే వారంలో వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే టెక్ కంపెనీల ఆదాయాలు సైతం తగ్గుతాయని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్న వేళ విప్రో విషయంలో ఇది ఎంత వరకు ఉంటుందనే ఆందోళనలు ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయి. దీంతో సోమవారం విప్రో కంపెనీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
వాస్తవానికి నాలుగేళ్ల కిందట సీఈవో, ఎండీగా థియరీ డెలాపోర్టే విప్రోలో బాధ్యతలు చేపట్టారు. అయితే తాజాగా తాను కంపెనీని వీడాలనుకుంటున్నట్లు ప్రకటించి రాజీనామాను బోర్డుకు అందించారు. దేశంలో అత్యధికంగా వార్షిక వేతనంగా 85 కోట్ల రూపాయలు అందుకుంటున్న టెక్ సీఈవోగా రికార్డు ఉన్నప్పటికీ సడెన్ రాజీనామా సర్వత్రా చర్చకు దారితీసింది. ఆయన స్థానంలో కంపెనీలోనే 30 ఏళ్లకు పైగా పనిచేసిన శ్రీనివాస్ పల్లియాను విప్రో బోర్డు కొత్త సీఈవో, ఎండీగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయంలో ఎన్ఎస్ఈలో విప్రో ఒక్కో షేర్లు ధర స్వల్ప క్షీణతతో రూ.485 రేటు వద్ద ప్రయాణాన్ని ముగించింది. ప్రస్తుత పరిస్థితులతో విప్రో షేర్లపై ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు.
1992లో విప్రోలో ఉద్యోగిగా చేరిన శ్రీనివాస్ పల్లియా కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్గా తన కెరీర్ జర్నీని ప్రారంభించారు. ఆ తర్వాతి కాలంలో కన్స్యూమర్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్, బిజినెస్ అప్లికేషన్ సర్వీసెస్ గ్లోబల్ హెడ్తో సహా అనేక నాయకత్వ పదవులను నిర్వహించారు. విద్యార్హతలను పరిశీలిస్తే.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీని పొందారు. దీనికి తోడు మెక్గిల్ విశ్వవిద్యాలయంలో అడ్వాన్స్డ్ లీడర్షిప్ ప్రోగ్రామ్ను, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో గ్లోబల్ లీడర్షిప్, స్ట్రాటజీ అండ్ మేనేజ్మెంట్లో కోర్సును పూర్తి చేశారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications