ఆ ఉద్యోగులకు విప్రో గుడ్న్యూస్, రెండోసారి వేతన పెంపు
జూనియర్ ఉద్యోగులకు ఐటీ దిగ్గజం విప్రో గుడ్న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 1వ తేదీ నుండి వేతనాలు పెంచుతామని శుక్రవారం నాడు ప్రకటించింది. అసిస్టెంట్ మేనేజర్ అంతకు తక్కువస్థాయి బ్యాండ్ B3 ఉద్యోగుల్లో అర్హులకు మెరిట్ శాలరీ ఇంక్రీజెస్ ఇవ్వనున్నట్లు తెలిపింది. జనవరిలోనే ఈ బ్యాండ్లోని పలువురు ఉద్యోగులకు వేతనాలు పెంచామని, దాదాపు 80 శాతం మంది ఉద్యోగులు ఈ జాబితాలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పుడు మరోసారి సెప్టెంబర్ నెలలో పెంచుతామన్నారు.
ఒక క్యాలెండర్ ఏడాదిలో రెండోసారి పెంచుతున్నట్లు తెలిపారు. గతంలో ప్రకటించినట్లు C1 బ్యాండ్పై ఉన్న అర్హులైన ఉద్యోగులకు జూన్ 1వ తేదీ నుండి వేతన పెంపు అమల్లోకి వస్తుందని వెల్లడించింది. విప్రోలో ఉద్యోగులను ఐదు బ్యాండ్లలో ఏ నుండి ఈ సబ్ ర్యాంకింగ్లతో విభజిస్తారు.
విప్రోలో 1,97,712 లక్షల మంది సిబ్బందిలో B3 బ్యాండ్ వరకు ఉన్నవారే ఎక్కువ. ఈ బ్యాండ్లో మంచి ప్రదర్శన కనబరిచిన వారికి గత ఏడాది డిసెంబర్ నెలలో విప్రో పదోన్నతులు ఇచ్చింది. ఈ కంపెనీ కొత్తగా 18వేల మందిని ఫ్రెషర్లను నియమించుకునే అవకాశముంది.