Wipro News: ఉచితంగా విప్రో షేర్లు కావాలా..? ఇదిగో సదవకాశం, డోన్ట్ మిస్ బెట్టింగ్ బాబులు..

Wipro Bonus Shares: దేశీయ టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న విప్రో తన పనితీరును గడచిన కొన్ని త్రైమాసికాలుగా మెరుగుపరచుకుంటోంది. అగ్రస్థాయి యాజమాన్యంలో కీలక మార్పులు చేపట్టిన తర్వాత కంపెనీ తిరిగి పనితీరులో ట్రాక్ పైకి ఎక్కింది. దీనికి ముందు కంపెనీ ఆదాయాల క్షీణత, వ్యాపార క్షీణత వంటి కీలకమైన అడ్డంకులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇన్వెస్టర్లు మాత్రం వీటికి సంబంధించిన పరిణామాలను నిరంతరాయంగా పరిశీలిస్తూనే ఉన్నారు.

అయితే ఇప్పుడు విప్రో కంపెనీ ఇన్వెస్టర్లకు కంపెనీ భారీ శుభవార్తను ప్రకటించింది. ప్రస్తుతం దేశీయంగా స్టాక్ మార్కెట్లలో పతనం కొనసాగుతున్నప్పటికీ ఐటీ దిగ్గజం విప్రో మాత్రం తన ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. దీంతో ఒక్కసారిగా కోలాహలం నెలకొంది. అర్హులైన ఈక్విటీ పెట్టుబడిదారులకు కంపెనీ 1:1 నిష్పత్తిలో వీటిని అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం అర్హత పొందటానికి ఇన్వెస్టర్లకు డిసెంబర్ 3, 2024ను రికార్డు తేదీగా కంపెనీ నిర్ణయించింది. అంటే ఈ సమయానికి తమ డీమ్యాత్ ఖాతాల్లో విప్రో షేర్లను కలిగి ఉన్న పెట్టుబడిదారులు కంపెనీ పుస్తకాల్లో నమోదు కాబడతారు. అలాంటప్పుడు వారికి బోనస్ షేర్లు బోర్డు నిర్ణయం మేరకు అందించబడతాయి. గత నెలలో జరిగిన బోర్డు సమావేశంలో ఈమేరకు చట్టపరంగా నిర్ణయాలు తీసుకోబడ్డాయి.

Wipro Rewarding Share holders with 1 bonus share for every share held fixed December 3rd as record Date

బోర్డు ఆమోదం తేదీ నుంచి 2 నెలలలోపు అంటే డిసెంబర్ 15, 2024 నాటికి షేర్లు క్రెడిట్ చేయబడతాయని విప్రో తెలిపింది. క్రెడిట్ తేదీ అనేది బోనస్ షేర్లు అర్హత కలిగిన షేర్‌హోల్డర్ల డీమ్యాట్ ఖాతాలలో షేర్లను జమచేసే డేట్. కంపెనీ చరిత్రను పరిశీలిస్తే 1971లో తొలిసారిగా తన పెట్టుబడిదారులకు ఉచితంగా బోనస్ షేర్లను ప్రకటించింది. ఈ క్రమంలోనే 1981-1996 మధ్యకాలంలో టెక్ దిగ్గజం దాదాపు 6 సార్లు బోనస్ షేర్లు అందించింది. దీని తర్వాత 1997, 2004, 2005, 2010, 2017, 2019 సంవత్సరాల్లో పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను రివార్డ్ చేసింది. దేశీయంగా ఉన్న ఇతర టెక్ కంపెనీలతో పోల్చితే విప్రో తన పెట్టుబడిదారులకు భారీగా రాబడిని అందించింది. సహజంగా మార్కెట్లో కంపెనీ షేర్లకు లిక్విడిటీ పెంచటానికి కంపెనీ తన పెట్టుబడిదారులకు షేర్లను రివార్డ్ చేస్తుంటాయి.

వర్క్ లైఫ్ బ్యాలెన్స్..
ఇటీవలి కాలంలో ఐటీ రంగంలోని పనిగంటలు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే విషయాలపై భారీగా చర్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇన్ఫోసిస్ స్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి యువతను వారానికి 70 గంటలు పనిచేయాలంటూ కామెంట్స్ చేయటం పెద్ద విమర్శకలకు దారితీసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ
కూడా స్పందించారు. ఈ మధ్యకాలంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. ఇది కొంత వివాదాస్పదమైన అంశంగానే ఉన్నప్పటికీ.. తమ సంస్థ ఉద్యోగులకు హైబ్రిడ్ వర్క్ విధానాన్ని అందుబాటులో ఉంచుతూ ప్రయోజనం చేకూరుస్తోందన్నారు. కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ప్రస్తుతం కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను పూర్తిగా వారంలో 5 రోజులు ఆఫీసులకు రావాల్సిందే అని తేల్చి చెప్పనప్పటికీ కొన్ని మాత్రం ఫ్లెక్సిబిలిటీలను ఇప్పటికీ అందిస్తూనే ఉండటం గమనించాల్సిన విషయం.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+